కోడెల కుమారుడిపై ఫిర్యాదుల పర్వం
సాక్షి, నరసారావుపేట: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడి అక్రమాలపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. నరసారావుపేట ఐలా బజారుకు చెందిన బసవేశ్వరరావు అనే వ్యక్తి మంగళవారం కోడెల శివరామ్పై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శివరామ్తోపాటు మరికొంతమంది తన స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్స్తో ఆక్రమించుకున్నారని, దీనిపై కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నా.. ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.