విమానాలు, స్టార్‌ హోటళ్లలో గడుపుతూ.. | Sakshi
Sakshi News home page

విమానాలు, స్టార్‌ హోటళ్లలో గడుపుతూ..

Published Tue, Jan 29 2019 8:26 PM

BJP MP GVL Narasimha Rao Slams Chandrababu Naidu Over His Allegations On Modi - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : కేంద్రం ఇచ్చిన నిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాలు, స్టార్ హోటళ్లలో విలాసవంతంగా గడుపుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోకెళ్లా ఏపీకే ప్రధాని మోదీ అధిక నిధులు ఇచ్చారని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయల కరువు సాయాన్ని ప్రకటించిందని జీవీఎల్ పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వ దొంగలు దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. దొంగ దీక్షలు చేస్తూ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కరువు సాయం ప్రభుత్వ దొంగల బారిన పడనివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ఓఆర్‌పీ అంటే ఒకే ర్యాంకు ఒకే పెన్షన్‌ అనేది బీజేపీ నినాదమైతే.. కాంగ్రెస్‌ వాళ్లకు మాత్రం ఓన్లీ రాహుల్‌-ఓన్లీ ప్రియాంక అంటూ ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement