‘రాహుల్.. హైదరాబాద్‌ నుంచి పోటీ చేయండి’

Asaduddin Owaisi Invite To Rahul Gandhi For Charminar Visit - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆదిలాబాద్‌, కామారెడ్డిలలో భారీ బహిరంగ సభలలో పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌ చేరుకొని చార్మినార్ దగ్గర జరిగే రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొననున్నారు. రాహుల్‌ గాంధీ.. చార్మినార్‌కు వస్తున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు.

‘చార్మినార్‌కు వస్తున్నందుకు రాహుల్‌ గాంధీకి స్వాగతం. మా నగరం అందరినీ గౌరవిస్తుంది. మీరు(రాహుల్‌ గాంధీ), బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు ఇక్కడి నుంచి పోటీచేయాల్సిందిగా కోరుతున్నాము. భిన్న జాతుల సంస్కృతి అంటే ఏమిటో ఇక్కడి ప్రజలు మీకు చూపిస్తారు. దోస్తులయినా, శత్రువులైనా అందరికీ హైదరాబాద్‌ స్వాగతం పలుకుతుంది’ అంటూ ఓవైసీ ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top