ఐవైఆర్‌పై ఆనంద్‌ సూర్య ధ్వజం | AP Brahmin Corporation Chairman Criticised IYR Krishna Rao | Sakshi
Sakshi News home page

ఐవైఆర్‌పై ఆనంద్‌ సూర్య ధ్వజం

Mar 10 2018 7:39 PM | Updated on Jul 28 2018 6:43 PM

AP Brahmin Corporation Chairman Anand surya - Sakshi

వేమూరి ఆనంద్‌ సూర్య

సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబునాయుడుపై అవాకులు చెవాకులు పేలితే మర్యాద దక్కదని ఐవైఆర్‌ కృష్ణారావును  ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆనంద్‌ సూర్య హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ తీరు గర్హనీయమైందనీ, మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డిలు మిమ్మల్ని పక్కన పెట్టిన సంగతి మర్చిపోయారా అంటూ విమర్శించారు. ఐవైఆర్‌ సొంత అజెండాతోనే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను భ్రష్టు పట్టించారని, రాజధాని నిర్మాణం, హోదా గురించి మొసలికన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. బ్రాహ్మణులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐవైఆర్‌ లాంటి కుహానా వ్యక్తులు ఏ వేదికల్లో ఉంటే ఆ వేదికలు అధోగతి పాలవుతాయని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement