ఎన్నారైల ఆధ్వర్యంలో 5కే రన్‌.. | nri teluggu associtions to organise a 5k run in hyderabad | Sakshi
Sakshi News home page

తెలుగు ఎన్‌ఆర్‌ఐల ఆధ్వర్యంలో  5కే రన్‌..

Dec 23 2017 1:13 PM | Updated on Jul 6 2019 12:42 PM

nri teluggu associtions to organise a 5k run in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌, తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌లు సంయుక్తంగా శనివారం ఉదయం హైదరాబాద్‌లో 5కే రన్‌  నిర్వహించాయి. మహిళా సాధికారత, ఒత్తిడిని అధిగమించే అంశాలపై  ప్రచారం చేస్తూ అమెరికా తెలుగు సంఘం, తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ  5కే పరుగును మంత్రి మహేందర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ  రన్‌లో ఎన్‌ఆర్‌ఐల పాటు పెద్దసంఖ్యలో యువ‌తీ యువ‌కులు  ఉత్సాహంగా పాల్గొన్నారు. లిబర్టీ నుంచి నెక్లెస్‌ రోడ్డు మీదుగా జలవిహార్‌ వరకూ ఈ 5 కే రన్‌ జరిగింది.

యూఎస్‌ఏ, ఇతర ప్రాంతాలలో ఎన్ఆర్‌ఐ తెలుగు అసోసియేషన్‌లు అన్ని ఒకే లక్ష్యంతో కలిసి పనిచేయడం లేదనే అపోహ ఉందని, అయితే ఈ కార్యక్రమం ద్వారా అది వాస్తవం కాదని నిరూపితమైందని ఎన్ఆర్‌ఐ ప్రతినిధులు అన్నారు. ఎన్‌ఆర్‌ఐ తెలుగు అసోసియేషన్‌లు అన్ని కలిసి 2018 డల్లాస్‌లో ఒక ఉమ్మడి  సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement