మైనర్ బాలికపై అత్యాచారం, హత్య; నిందితుడికి ఉరిశిక్ష | Youth gets death penalty for raping, murdering minor | Sakshi
Sakshi News home page

మైనర్ బాలికపై అత్యాచారం, హత్య; నిందితుడికి ఉరిశిక్ష

Nov 22 2013 4:36 PM | Updated on Jul 30 2018 9:21 PM

మైనర్ బాలికను కిరాతకంగా అత్యాచారం చేసి, హత్యచేసిన కేసులో భరత్ కుమార్ (23) అనే యువకుడికి ఉరిశిక్ష పడింది.

మైనర్ బాలికను కిరాతకంగా అత్యాచారం చేసి, హత్యచేసిన కేసులో భరత్ కుమార్ (23) అనే యువకుడికి ఉరిశిక్ష పడింది. ఢిల్లీ కోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇలాంటి వ్యక్తులు సమాజానికి హానికరమని, సంఘంలో జీవించడానికి అనర్హులని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దోషి మరణించే వరకు ఉరితీయాలని అడిషనల్ సెషన్స్ జడ్జి వీరేంద్ర భట్ ఆదేశించారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2010 సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. భరత్ తన ఇంటి పక్కన నివసించే బాలికకు (అప్పటికి 7-11 ఏళ్ల మధ్య వయసు) స్నాక్స్, చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపాడు. అనంతరం ఢిల్లీకి దగ్గరలోని పాలెం గ్రామం సమీపంలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. కర్కశంగా ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. ముఖం, శరీరంపై తీవ్రంగా గాయపరిచాడు. విషయం వెలుగులోకి వస్తుందనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని అక్కడే చంపేసి వెళ్లిపోయాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు భరత్ నేరం చేసినట్టు రుజువు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement