తెలంగాణ నోట్ ఇప్పట్లో రాదు: కావూరి సాంబశివరావు | Won't come Telangana Note not now, says Kavuri samba sivarao | Sakshi
Sakshi News home page

తెలంగాణ నోట్ ఇప్పట్లో రాదు: కావూరి సాంబశివరావు

Sep 7 2013 3:26 AM | Updated on Sep 27 2018 5:56 PM

రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణ నోట్ ఇప్పట్లో కేబినెట్ ముందుకు వచ్చే ప్రసక్తే లేదని, అందుకు మరింత సమయం పడుతుందని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు.

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణ నోట్ ఇప్పట్లో కేబినెట్ ముందుకు వచ్చే ప్రసక్తే లేదని, అందుకు మరింత సమయం పడుతుందని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరమే దీనిపై కదలిక వచ్చే అవకాశం ఉందన్నారు. సీమాంధ్రలో ఉధృతంగా జరుగుతున్న ఉద్యమాన్ని కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, తాము చేసిన నిర్ణయంపై పునరాలోచనలో పడిందని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరిగేవరకు విభజనపై కాంగ్రెస్ ముందుకు పోదనే  భావిస్తున్నానని ఆయన శుక్రవారం తన కార్యాలయంలో మీడియాకు తెలిపారు. ైహైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని తానెన్నడూ కోరలేదని, దాన్ని మూడో రాష్ట్రంగా చేయాలని కోరుతూ వచ్చానని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement