దేశంలో దేవుళ్ల గొడవ పెరిగింది | Visakha Sarada Peetam Swarupananda Saraswati Book releases of Vishuddha Vedanta Saara | Sakshi
Sakshi News home page

దేశంలో దేవుళ్ల గొడవ పెరిగింది

Jul 8 2014 11:06 AM | Updated on Sep 2 2017 10:00 AM

దేశంలో దేవుళ్ల గొడవ పెరిగింది

దేశంలో దేవుళ్ల గొడవ పెరిగింది

ప్రస్తుత సమాజంలో మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అన్న తగవులు పెరిగాయని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ ...

న్యూఢిల్లీ : ప్రస్తుత సమాజంలో మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అన్న తగవులు పెరిగాయని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటోలో, వీధుల్లో రాజకీయాల్లో గొడవల కంటే దేశంలో దేవుళ్ల గొడవే అధికంగా ఉందన్నారు. 'విశుద్ధ వేదాంత సర్' అనే హిందీ అనువాద వేదాంత గ్రంథాన్ని ఆయన నిన్న టీటీడీ ధ్యానమందిరంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ పీఠాల ద్వారా శంకరాచార్యులు ఏం చెప్పారు. వేదాంతసారం ఏమిటన్నది చెప్పడానికే ఈ పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. ఈ అంశాలను ఉత్తర భారతీయులకు తెలియజెప్పేందుకే హిందీలో ఆవిష్కరించినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement