చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ | Two Maoists Were Killed in Encounter | Sakshi
Sakshi News home page

చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌

Jun 14 2019 4:40 PM | Updated on Jun 14 2019 6:17 PM

Two Maoists Were Killed in Encounter - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చత్తీస్‌గఢ్‌: పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన కాంకర్‌ జిల్లా తడోకి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్స్‌ డీఐజీ పి. సుందర్‌ రాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా రిజర్వ్‌ దళాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాసేపటి తర్వాత అవతలి వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. అనంతరం మొదట కాల్పులు ప్రారంభమైన చోటుకి వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వాటితో పాటు రెండు ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకులు, ఒక .303 రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని డీఐజీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement