ట్రక్కు, జీపు ఢీ కొట్టిన ఘటనలో 11 మంది మృత్యువాత పడిన ఘటన...
రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం
Aug 27 2017 10:00 AM | Updated on Aug 30 2018 4:10 PM
బర్వాలా: గుజరాత్లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, జీపు ఢీ కొట్టడంతో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బర్వాల హైవేలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మహారాష్ట్ర నుంచి గుజరాత్లోని పలిటనాకు ఓ ట్రక్కులో 11 మంది వెళ్తున్నారు. ధుందక్ బర్వాలా రోడ్డు వద్దకు చేరుకోగానే ఓ జీపును ట్రక్కు బలంగా ఢీకొట్టింది. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే నాలుగు 108 వాహనాలు ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాసుస్పత్రికి తరలించాయి. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement