సాక్షి, ముంబై: తన పార్టీని మహారాష్ట్రలో వీలైనంత మేర విస్తరించేందుకు మజ్లిస్-ఎ-ఇత్తహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ప్రయత్నాలు తీవ్రం చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పలు ప్రాంతాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్కు చెందిన ఈ పార్టీ ఇప్పటికే మరాఠ్వాడాలోని ఎనిమిది జిల్లాల్లో కార్యాలయాలను ప్రారంభించి ఎన్నికల కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే తూర్పు ఔరంగాబాద్, సెంట్రల్ ఔరంగాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎంఐఎం నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్న అభ్యర్థుల బలాబలాలను మదింపు చేయనున్నట్టు తెలిసింది.
సెప్టెంబరు మొదటివారంలో అభ్యర్థులను ఖరారు చేయనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్సీపీకి చెందిన కొంద రు అసంతృప్తి నాయకులు ఎంఐఎంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వినికిడి. మరాఠ్వాడా, ముంబై, నాసిక్ జిల్లాలతోపాటు విదర్భ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది. నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్లో 11 స్థానాలను ఎంఐంఎం గెలుచుకున్నప్పటికీ, సిల్లోడ్ మున్సిపాలిటీలో అంతగా విజయం సాధించలేకపోయింది. దీని తరువాత నిర్వహించిన లోకసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నా, తాజా అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహరచన మొదలుపెట్టింది.
మరాఠ్వాడలో 25 శాతం ముస్లింలు
మరాఠ్వాడాలో దాదాపు 25 శాతం మంది ముస్లింలు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మైనార్టీ ఓటర్ల సంఖ్య 30 నుంచి 40 శాతం వరకు ఉంది. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతోనూ పొత్తులు పెట్టుకునే విషయంపై కూడా ఎంఐఎం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు సెంట్రల్ ఔరంగాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరోవైపు ఈ నియోజకవర్గంలో ఎన్సీపీకి చెందిన ఏడుగురు నాయకులు ఈసారి టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరిలో టిక్కెట్ లభించని అభ్యర్థులు ఎంఐఎం నుంచి పోటీ చేసేందుకు ఆస్కారం ఉంది.
సంప్రదింపుల్లో ఉన్నారు.. -ఖురేషీ
ఔరంగాబాద్ నుంచి పోటీ చేసేందుకు అనేక మంది ఆసక్తి బరుస్తున్నారని ఎంఐఎం జిల్లా అధ్యక్షులు జావేద్ ఖురేషీ తెలిపారు. ఎన్సీపీకి చెందిన పలువురు తమతో సంప్రదింపుల్లో ఉన్నారని చెప్పారు. అయితే ఔరంగాబాద్ టికెట్ ఎవరికి కేటాయించాలనే విషయంపై తుది నిర్ణయం పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీసుకుంటారని చెప్పారు.
ఎంఐఎం ఎన్ని‘కలలు’
Published Thu, Aug 21 2014 10:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement