ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం | The death of three Lashkare terrorists | Sakshi
Sakshi News home page

ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం

Jun 23 2017 1:00 AM | Updated on Sep 5 2017 2:14 PM

ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం

ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం

కశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లాలో గురువారం వేకువ జామున

పుల్వామా: కశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లాలో గురువారం వేకువ జామున ముగిసిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఆ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. అనంతరం చెలరేగిన అల్లర్లలో ఓ పౌరుడు చనిపోయాడు. భద్రతా బలగాలపై రాళ్లు రువ్వుతున్న గుంపును అతడు ముందుండి నడిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

కాకాపురా ప్రాంతంలోని ఓ ఇంట్లో ఎల్‌ఈటీ కీలక కమాండర్‌ మజీద్‌ మీర్‌ సహా ముగ్గురు ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారన్న సమాచారం అందడంతో పోలీసులు బుధవారం సాయంత్రమే అక్కడ కార్డన్‌ సెర్చ్‌ ప్రారంభించారు. రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 4 గంటల దాకా ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాక్కున్న ఇంటికి మంటలు అంటుకున్న తరువాత, తప్పించుకోవడానికి వారు బయటికి పరుగులు పెట్టారు. లొంగిపొమ్మని పోలీసులు సూచించినా మాట వినకపోవడంతో వారిని కాల్చి చంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement