ఒక్క టీ ఖరీదు.. రూ. 20 వేలు! | Sakshi
Sakshi News home page

ఒక్క టీ ఖరీదు.. రూ. 20 వేలు!

Published Fri, Dec 26 2014 3:38 PM

ఒక్క టీ ఖరీదు.. రూ. 20 వేలు! - Sakshi

టీ ఖరీదు సాధారణంగా ఎంత ఉంటుంది? మహా అయితే 5 నుంచి 10 రూపాయల లోపు. అదే స్టార్ హోటళ్లలో అయితే.. 50 రూపాయలు. అదే.. అరవింద్ కేజ్రీవాల్తో కలిసి టీ తాగాలనుకుంటే మాత్రం మీరు రూ.20వేలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తమ ఎన్నికల ఖర్చుల కోసం నిధులు సేకరిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే భోజనాల పేరుతో విరాళాలు వసూలుచేసిన ఆప్ నేతలు.. ఇప్పుడు ఈ టీ విరాళం మొదలుపెట్టారు. ఢిల్లీ న్యాయశాఖ మాజీమంత్రి సోమ్నాథ్ భారతి ఇంట్లో తేనీటి విందు ఏర్పాటుచేశారు. దాంతో పాటు.. ఆమ్ ఆద్మీ పార్టీకి విరాళాలు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో జరిగిన విరాళాల కార్యక్రమాల్లో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement