మహిళ నుంచి రూ. 7.4 కోట్ల డ్రగ్స్ స్వాధీనం | Tanzanian woman caught in Mumbai airport’s biggest narcotics haul | Sakshi
Sakshi News home page

మహిళ నుంచి రూ. 7.4 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

Jun 17 2015 3:38 PM | Updated on Sep 3 2017 3:53 AM

మహిళ నుంచి రూ. 7.4 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

మహిళ నుంచి రూ. 7.4 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

74 కేజీల మెథాక్విలోన్ ను తరలిస్తున్న టాంజానియా మహిళ చాంబో ఫాత్మా బాసిల్ ఎయిర్ ఇంటిలిజెన్స్ విభాగానికి చిక్కింది. ఈ డ్రగ్స్ విలువ 7.4 కోట్ల రూపాయలు వుంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.

ముంబై: ముంబై ఎయిర్పోర్ట్లో బుధవారం భారీ ఎత్తున మత్తు మందులను  స్వాధీనం చేసుకున్నారు.   దోహా మీదుగా  దార్-ఇ-సలామ్కు  భారీ ఎత్తున  మెథాక్విలోన్ అక్రమంగా తరలిస్తుండగా స్నిఫర్ డాగ్స్  పట్టేశాయి. 74  కేజీల మెథాక్విలోన్ ను తరలిస్తున్న టాంజానియా  మహిళ చాంబో ఫాత్మా బాసిల్   ఎయిర్ ఇంటిలిజెన్స్ విభాగానికి చిక్కింది.   ఈ డ్రగ్స్ విలువ 7.4 కోట్ల  రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.


సాధారణ తనిఖీల్లో భాగంగా స్నిఫర్   డాగ్స్  మత్తు మందుల బ్యాగ్ ను గుర్తించాయని  ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున  మత్తుమందులను పట్టుకోవడం ఇదే మొదటిసారని కస్టమ్స్  ఎడిషనల్ కమిషనర్ మిలింద్ లాంజేవార్ తెలిపారు.   తక్షణమే బాసిల్ను అదుపులోకి తీసుకున్నామని తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు. గతంలో జింబాబ్వే మహిళ 13  కేజీలు ,ఇపుడు టాంజానియా మహిళ74  కేజీల అక్రమంగా రవాణా చేస్తున్న మత్తుమందులను  పట్టుకోవడంలో కూడా తమ స్నిఫర్  డాగ్స్ టీమ్  ప్రముఖ పాత్ర వహించాయని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement