పశు, మత్స్యశాఖలకు నిధులు పెంచుతాం | talasani Srinivas Yadav released veterinarians Association Dairy | Sakshi
Sakshi News home page

పశు, మత్స్యశాఖలకు నిధులు పెంచుతాం

Jan 31 2017 4:33 AM | Updated on Jun 2 2018 8:44 PM

వచ్చే బడ్జెట్‌లో పశు, మత్య్స శాఖలకు భారీగా నిధులు కేటాయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌  
సాక్షి, హైదరాబాద్‌: వచ్చే బడ్జెట్‌లో పశు, మత్య్స శాఖలకు భారీగా నిధులు కేటాయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ శాఖలు ఎంతో ప్రాధాన్యత కలిగినవిగా గుర్తింపు సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సచివాలయంలో తెలంగాణ నాన్  గెజిటెడ్‌ వెటర్నరీయన్స్ అసోసియేషన్  డైరీని సోమవారం ఆయన ఆవిష్కరించారు.

మంత్రి మాట్లాడుతూ.. పశుసంవర్థక, మత్స్యశాఖల అభివృద్ధికోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు. 161 మంది వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ లను నియమించామని, త్వరలో మరో 180 మంది నియామకం చేపట్టనున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement