సీమాంధ్రకు న్యాయం చేస్తాం: సుశీల్కుమార్ షిండే | Sushilkumar shinde says to Justify for seemandhra | Sakshi
Sakshi News home page

సీమాంధ్రకు న్యాయం చేస్తాం: సుశీల్కుమార్ షిండే

Oct 7 2013 8:48 PM | Updated on Sep 1 2017 11:26 PM

సీమాంధ్రకు న్యాయం చేస్తాం: సుశీల్కుమార్ షిండే

సీమాంధ్రకు న్యాయం చేస్తాం: సుశీల్కుమార్ షిండే

సీమాంధ్ర ప్రాంత సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే అన్నారు.

 సీమాంధ్ర ప్రాంత సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న అభద్రతాభావం, ఆందోళనలు తమ దృష్టికి వచ్చాయని వెల్లడించారు. సీమాంధ్ర ప్రజలందరికీ న్యాయం చేస్తామని షిండే చెప్పారు.

అన్ని ప్రాంతాలవారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోమవారం సాయంత్రం ఆయనను కలిశారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు, నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement