ఎస్ఐ కుటుంబ సభ్యుల ఆత్మహత్య | SUICIDE Three family members of Delhi Police SI commit suicide | Sakshi
Sakshi News home page

ఎస్ఐ కుటుంబ సభ్యుల ఆత్మహత్య

May 25 2016 12:09 PM | Updated on Nov 6 2018 7:56 PM

సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ) కుటుంబ సభ్యులు ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ) కుటుంబ సభ్యులు ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. కశ్మీరీ గేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ కృష్ణపాల్ భార్య మునేష్(45), కుమారుడు ధీరజ్ కుమార్(23), కూతురు లూనా(21)లు మంగళవారం వేగంగా వెళ్తున్న రైలుముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.

కాగా.. శనివారం నుంచి తన భార్య, పిల్లలు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కృష్ణపాల్ ఫిర్యాదు చేశాడు. అయితే వీరిని వెతికే పనిలో ఉన్న పోలీసులు, షామ్లీ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు రైలు కింద పడి మృతి చెందారన్న సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించగా.. ఆ ముగ్గురూ కృష్ణపాల్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. వీరి మృతికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సర్కిల్ ఆఫీసర్ నిషాంక్ శర్మ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement