'మోదీ సర్కార్ను నడిపేది సుబ్రహ్మణ్యమే' | Subramanian Swamy running the Modi government: Congress | Sakshi
Sakshi News home page

'మోదీ సర్కార్ను నడిపేది సుబ్రహ్మణ్యమే'

Dec 9 2015 8:23 PM | Updated on Mar 18 2019 9:02 PM

'మోదీ సర్కార్ను నడిపేది సుబ్రహ్మణ్యమే' - Sakshi

'మోదీ సర్కార్ను నడిపేది సుబ్రహ్మణ్యమే'

నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో తమ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్డీయే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీపై ముప్పేట దాడికి దిగారు.

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో తమ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్డీయే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీపై ముప్పేట దాడికి దిగారు. బుధవారం రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రధాని నరేంద్రమోదీపై విరుచుపడుతూ మోదీ సర్కార్ను బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి నడుపుతున్నారని అన్నారు.

ఆగస్టులోనే ఈడీ ఈ కేసును మూసివేసిందని, కావాలనే కొత్త డైరెక్టర్ ను నియమించుకొని బీజేపీ తమపై కక్షకు దిగిందని ఆయన ఆరోపించారు. ఎన్డీయే ప్రజాస్వామ్యాన్ని నలిపేసిందని, వదించిందని, ఖూనీ చేసిందంటూ పరుష పదాలను ఉపయోగించారు.

Advertisement
 
Advertisement
Advertisement