ఐదింతలు పెరిగిన రైళ్లల్లో చోరీ కేసులు | Railway theft sees five-fold increase in past decade with 171000 cases | Sakshi
Sakshi News home page

ఐదింతలు పెరిగిన రైళ్లల్లో చోరీ కేసులు

Apr 29 2019 3:59 AM | Updated on Apr 29 2019 3:59 AM

Railway theft sees five-fold increase in past decade with 171000 cases - Sakshi

న్యూఢిల్లీ: గడిచిన పదేళ్లలో రైళ్లలో దొంగతనం కేసులు ఐదింతలు పెరిగాయి. రైళ్లల్లో దొంగతనం ఘటనలకు సంబంధించి 2009 నుంచి 2018 వరకూ 1,71,015 కేసులు నమోదైనట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇందులో 2018లో అత్యధికంగా 36,584 కేసులు నమోదయ్యాయి. ఈమేరకు పీటీఐ వార్తా సంస్థకు చెందిన ఓ పాత్రికేయుడు ఆర్టీఐ ద్వారా రాసిన లేఖకు రైల్వే సమాధానమిచ్చింది. రైల్వే శాఖ సమాచారం ప్రకారం రైళ్లల్లో దొంగతనం ఘటనలకు సంబంధించి 2017లో 33,044, 2016లో 22,106, 2015లో 19,215, 2014లో 14,301, 2013లో 12,261, 2012లో 9,292, 2011లో 9,653, 2010లో 7,549, 2009లో 7,010 కేసులు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement