పాకిస్థాన్ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ భరోసా ఇచ్చారు. భారత ఆర్మీ ఇటీవల చేపట్టిన నిర్దేశిత దాడులపై ప్రజలు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు. పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంటుందన్న అనుమానంతో సరిహద్దు గ్రామాల ప్రజలను పునరావాసాలకు తరలిస్తున్న నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇండో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించేందుకు అనుమతిస్తామన్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ పఠాన్ కోట్ జిల్లాల్లోని సహాయక శిబిరాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంలో నిర్వహించిన సమావేశంలో ఆయన రైతులనుద్దేశించి ప్రసంగించారు. రైతులు తమ పంటను పిల్లలకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటారన్నారు. సరిహద్దు ప్రాంత రైతులు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సహాయంతో పంటలను కోసి ఇంటికి తెచ్చుకునేందుకు వీలుగా ఏర్పాట్లకోసం కేంద్ర ప్రభుత్వంతోపాటు, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అనుమతి కోరినట్లు బాదల్ తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో నివసించే రైతులంతా నిజమైన దేశ భక్తులుగా బాదల్ అభివర్ణిచారు. శత్రుభయంతో రోజువారీ తలపడే సరిహద్దు ప్రాంతాల్లోని రైతులంతా మాతృభూమికి నిజమైన సేవకులన్నారు.
ఇండో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తమ ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని, సరిహద్దు గ్రామాలను వదిలి వెడుతున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎప్పటికప్పుడు తగిన సహాయాన్ని అందిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు గ్రామాలను ఖాళీచేయించడంతోపాటు, సహాయక శిబిరాల్లో ఏర్పాట్లపై క్రమం తప్పకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేపడతారని చెప్పారు. సహాయక శిబిరాల ఏర్పాట్లపై పోలీసు, మరియు జిల్లా యంత్రాంగాలను ప్రశంసించిన బాదల్.. ఈ పరిస్థితుల్లో ప్రతి అధికారీ ఎంతో జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. బార్త్ సాహిబ్, బమియాల్ శిబిరాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడి ప్రజల సంరక్షణ, ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.
ఆ గ్రామస్తులకు సీఎం భరోసా..
Published Sat, Oct 1 2016 8:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement