నిరుద్యోగంపై రాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదారాబాద్ : భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ యువత, నిరుద్యోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం సోషల్మీడియా ట్విటర్ వేదికగా నిరుద్యోగం గురించి వ్యాఖ్యానించారు. స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను గురించి ఆయన ట్వీట్ చేశారు.
భారత వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా నిరుద్యోగాన్ని అరికట్టివచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వరి, పాలు, పళ్లు, కూరగాయలు, మిర్చి పండించి సూపర్ మార్కెట్లకు అందిచండం ద్వారా ప్రపంచానికి ఆహారాన్ని అందించవచ్చని కోవింద్ అన్నారు. వ్యవసాయ రంగం భారత్లోని వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్సించడంలో సహాయ పడుతుందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.