యోగి హయాంలో 420 ఎన్‌కౌంటర్లు | Sakshi
Sakshi News home page

యోగి హయాంలో 420 ఎన్‌కౌంటర్లు

Published Sat, Sep 16 2017 5:49 PM

యోగి హయాంలో 420 ఎన్‌కౌంటర్లు

సాక్షి, లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ అధికారం చేపట్టాక ఈ ఆరు నెలల్లో జరిగిన మొత్తం ఎన్‌కౌంటర్ల 420. ఇదే విషయాన్ని యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. శాంతి భద్రతలను కాపాడడం, నేరాలను అదుపు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలను ఆయన గణాంకాలతో వివరిస్తూ తిప్పికొట్టారు. ఈ ఆరు నెలల్లో నేరాలను చాలా వరకు అదుపు చేయడంతో పాటు, శాంతి భద్రతలను పెంపొందించామని చెప్పారు.

బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. ఇప్పటి వరకూ పోలీసులు 420 ఎన్‌కౌంటర్లు చేశారని ఆయన తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లలో 15 మంది నేరస్థులు చనిపోగా.. పలువురు గాయాలపాలై లొంగిపోయారని తెలిపారు.
చిత్రకూట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేరస్థులు జరిపిన కాల్పుల్లో ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ మృతి చెందారని వివరించారు. నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆదిత్యనాథ్‌ అన్నారు.
 

Advertisement
Advertisement