మహిళా రిజర్వేషన్‌పై ఒడిశా సీఎం తీర్మానం | Odisha House passes 33% reservation for women | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్‌పై ఒడిశా సీఎం తీర్మానం

Nov 21 2018 2:44 AM | Updated on Nov 21 2018 2:44 AM

Odisha House passes 33% reservation for women - Sakshi

భువనేశ్వర్‌: రాష్ట్రాల శాసనసభలు, పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కోరుతూ ఒడిశా సీఎం పట్నాయక్‌ మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. మహిళా సాధికారత లేకుండా ఏ సమాజం, రాష్ట్రం, దేశం ముందుకు సాగవని ఆయన ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఆయన అభిప్రాయపడ్డారు.

మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి సభ్యులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 1992లో తన తండ్రి, మాజీ సీఎం బిజూ పట్నాయక్‌ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి, వారికి రాజకీయ నిర్ణయాధికారాల్లో భాగస్వామ్యం కల్పించారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement