వాటర్‌గ్రిడ్‌కు నిధులు ఇవ్వలేం | no funds for water grid program reply from lokh sabha for jithender reddy question | Sakshi
Sakshi News home page

వాటర్‌గ్రిడ్‌కు నిధులు ఇవ్వలేం

Dec 18 2015 2:14 AM | Updated on Sep 3 2017 2:09 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు నిధులు అందించలేమని కేంద్రం స్పష్టం చేసింది.

లోక్‌సభలో ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు నిధులు అందించలేమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో గురువారం టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిస్తూ.. కేంద్ర తాగునీటి శాఖ సహాయ మంత్రి రాంకృపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. వాటర్‌గ్రిడ్ పథకానికి అయ్యే మొత్తం వ్యయం రూ. 42,474 కోట్లలో సగం నిధులను భరించాల్సిందిగా కేంద్రాన్ని తెలంగాణ సీఎం కోరారని, ఆ విధంగా నిధులు ఇవ్వలేమని  పేర్కొన్నారు.

అయితే ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి అందే నిధులను వాటర్‌గ్రిడ్ పథకానికి వినియోగించుకోవచ్చని చెప్పారు. అవసరమైతే విదేశీ సంస్థల నుంచి ఆర్థికసాయం పొందే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement