మాజీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్థత | ND Tiwari hospitalised after brain stroke | Sakshi
Sakshi News home page

మాజీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్థత

Sep 20 2017 9:53 PM | Updated on Sep 21 2017 1:39 PM

మాజీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్థత

మాజీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్థత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ ఎన్‌డీ తివారీ (91) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

న్యూఢిల్లీ:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ ఎన్‌డీ తివారీ (91) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం 9 గంటలకు ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో ఢిల్లీలోని మాక్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, ప్రత్యేక డాక్టర్ల బృందం చికిత్స చేస్తోందని కుమారుడు రోహిత్‌ శేఖర్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలో లేరని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement