న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సున్నిత విమర్శలు చేశారు. భారతదేశం అనే భావనను ప్రస్తుత ప్రభుత్వం నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశం తిరోగమన పరిస్థితుల్లో ఉందని, అది కూడా కేవలం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే పరిమితమైకాక శాంతియుత పరిస్థితులకు, భిన్నత్వ భావనకు పాకుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అసలైన భావనను తుడిచేయాలనుకుంటున్న వారి నుంచి భారత్ను రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మంగళవారం కాంగ్రెస్పార్టీ సీనియర్ నేతలతో(కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ)తో ఢిల్లీలో అత్యున్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసిన ఆమె ఈ సందర్భంగా వారితో పలు విషయాలు చర్చించారు.
‘ఒకప్పుడు ఎక్కడైతే సామరస్యం ఉందో అక్కడ నేడు అది కనిపించకుండా పోతోంది. ఎక్కడైతే ఆర్థికసామర్థ్యం ఉందో ఇప్పుడక్కడ స్తబ్ధత నెలకొంది. ఒకప్పుడు ఎక్కడ సహనం ఉందో ఇప్పుడు అక్కడ రెచ్చగొట్టుతత్వం ఏర్పడుతోంది. అందుకే భారతదేశం అసలు ఏ భావనతో ఏర్పడిందో దానిని మనం ఇప్పుడు తప్పకుండా రక్షించాల్సినవసరం ఉంది’ అని సోనియా గాంధీ తమ పార్టీ నేతలకు సూచించారు. ఇక 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఎవరికీ వారుగా వ్యక్తిగత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
‘భారత్’ను రక్షించాల్సిన అవసరం ఉంది’
Published Tue, Jun 6 2017 3:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
వర్ష బీభత్సం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
తప్పక చదవండి
Advertisement