భారత ప్రధాని నరేంద్రమోదీ భారత రాజ్యాంగ నిర్మాత జన్మభూమిని సందర్శించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన మౌలోని అంబేద్కర్ స్మారక స్థలాన్ని సందర్శించారు.
భోపాల్: భారత ప్రధాని నరేంద్రమోదీ భారత రాజ్యాంగ నిర్మాత జన్మభూమిని సందర్శించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన మౌలోని అంబేద్కర్ స్మారక స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్ ను ప్రారంభించిన మోదీ బహిరంగ సభలో మాట్లాడారు.
ఆర్థిక అసమానతలకు, అన్యాయానికి వ్యతిరేకంగా అంబేడ్కర్ పోరాడారని అన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని చెప్పారు. పంచాయతీ రాజ్ సంస్థలు మరింత బలంగా, ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు.