ఇప్పుడంతా మందు మరిచి పాల వైపు.. | Milk sale rises by 11 pc in 7 months since prohibition: Nitish | Sakshi
Sakshi News home page

ఇప్పుడంతా మందు మరిచి పాల వైపు..

Nov 9 2016 7:58 PM | Updated on Aug 17 2018 7:40 PM

ఇప్పుడంతా మందు మరిచి పాల వైపు.. - Sakshi

ఇప్పుడంతా మందు మరిచి పాల వైపు..

తమ రాష్ట్రంలో మద్యంపై నిషేధం విధించిన తర్వాత పాల కొనుగోలు శాతం పెరిగిందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు.

పట్నా: తమ రాష్ట్రంలో మద్యంపై నిషేధం విధించిన తర్వాత పాల కొనుగోలు శాతం పెరిగిందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. పాల కొనుగోళ్ల శాతం గత ఏడు నెలల్లోనే 11శాతం పెరిగినట్లు ఆయన చెప్పారు. పశ్చిమ చంపారన్ జిల్లాలో నిశ్చయ యాత్ర సందర్భంగా నిర్వహించిన చేతన సభలో ఆయన మాట్లాడుతూ స్వీట్లు, తేనెవంటివాటి వాడకం పెరగడం కూడా ఆల్కహాల్ నిషేధం వల్లేనని చెప్పారు.

గతంలో దాదాపు రూ.10వేల కోట్లు మద్యం కోసం ప్రజలు ఖర్చు చేసేవారని, ఇప్పుడు పాలు, పండ్లను కొనుగోలు చేస్తూ ఆరోగ్యం కోసం ఖర్చు చేసుకుంటున్నారని, ఇది మంచి పరిణామం అని అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న మద్యపాన నిషేధ చట్టంపై అభిప్రాయాలు తెలుసుకోవడమే నిశ్చయ యాత్ర ప్రధాన ఉద్దేశమని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement