ఎన్‌కౌంటర్‌: మావోయిస్టు ఏరియా కార్యదర్శి మృతి | Maoist killed in Bastar encounter | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌: మావోయిస్టు ఏరియా కార్యదర్శి మృతి

May 15 2017 11:12 AM | Updated on Oct 8 2018 8:37 PM

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ బార్చూర్‌ ఏరియా కమిటీ కార్యదర్శి విలాప్‌ మృతి చెందాడు.

చర్ల: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బస్తర్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ బార్చూర్‌ ఏరియా కమిటీ కార్యదర్శి విలాప్‌ మృతి చెందాడు. సంఘటన స్థలంలో  ఏకే-47 ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దులో ఉన్న బస్తర్‌ జిల్లాలోని బుర్గుం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.
 
ఈ సందర్భంలో తారసపడ్డ మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన బార్చూర్‌ ఏరియా కమిటీ కార్యదర్శి విలాప్‌ మృతి చెందారు. మృతదేహం వద్ద నుంచి ఒక ఏకే-47 తుపాకీని,  కిట్‌బ్యాగ్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టు ఏరియా కమిటీ కార్యదర్శి విలాప్‌పై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రూ 16 లక్షల రివార్డ్‌ను ప్రకటించి ఉన్నట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement