ప్రకృతిని కాపాడుకుందాం: ఆప్ | Kejriwal leads Cabinet, officials on pledge to protect nature | Sakshi
Sakshi News home page

ప్రకృతిని కాపాడుకుందాం: ఆప్

Jun 5 2015 2:07 PM | Updated on Oct 20 2018 4:36 PM

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుతామంటూ ప్రతిజ్ఞ చేసిం

న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా  ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుతామంటూ ప్రతిజ్ఞ చేసింది.  ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు ప్రమాణం చేసింది. మన రోజువారీ  జీవితంలో భాగంగా   ప్రకృతిని కాపాడుతామని ప్రతిన  బూనాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్  పేర్కొన్నారు.

 

ఈ  సందర్భంగా సీఎం కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ సెక్రటేరియట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఇతర మంత్రులు,   చీఫ్ సెక్రటరీ కెకె శర్మ, సీనియర్ ప్రభుత్వ అధికారులు, వివిధ శాఖలు ముఖ్యఅధికారులు కూడా మొక్కలు నాటిన వారిలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement