నేటి నుంచి ‘జడ్జీల పేరుతో లంచం’ కేసు విచారణ | Judges bribery case: 3-judge Supreme Court bench likely to hear plea today onwards | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘జడ్జీల పేరుతో లంచం’ కేసు విచారణ

Nov 13 2017 2:54 AM | Updated on Sep 22 2018 8:25 PM

Judges bribery case: 3-judge Supreme Court bench likely to hear plea today onwards - Sakshi

న్యూఢిల్లీ: కేసుల పరిష్కారానికి జడ్జీల పేరుతో లం చాలు తీసుకున్న కేసును సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం నేటి నుంచి విచారించనుంది. ఈ కేసును విచారించడానికి ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పా టు చేయాలని జస్టిస్‌ జె.చలమేశ్వర్, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ల బెంచ్‌ నవంబర్‌ 9న ఇచ్చిన ఆదేశాలను తర్వాతి రోజు సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి న్యాయవాది కామిని జైశ్వాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఆర్కే అగర్వాల్, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ల ధర్మాసనం మధ్యాహ్నం 3.30 గంటలకు విచారించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement