నేటి నుంచి ‘జడ్జీల పేరుతో లంచం’ కేసు విచారణ

Judges bribery case: 3-judge Supreme Court bench likely to hear plea today onwards - Sakshi

న్యూఢిల్లీ: కేసుల పరిష్కారానికి జడ్జీల పేరుతో లం చాలు తీసుకున్న కేసును సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం నేటి నుంచి విచారించనుంది. ఈ కేసును విచారించడానికి ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పా టు చేయాలని జస్టిస్‌ జె.చలమేశ్వర్, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ల బెంచ్‌ నవంబర్‌ 9న ఇచ్చిన ఆదేశాలను తర్వాతి రోజు సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి న్యాయవాది కామిని జైశ్వాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఆర్కే అగర్వాల్, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ల ధర్మాసనం మధ్యాహ్నం 3.30 గంటలకు విచారించనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top