జైల్లో లాలూకు సేవకులు: జేడీయూ | jdu on lalu prasad yadav | Sakshi
Sakshi News home page

జైల్లో లాలూకు సేవకులు: జేడీయూ

Jan 10 2018 1:25 AM | Updated on Jan 10 2018 1:25 AM

jdu on lalu prasad yadav - Sakshi

పట్నా/రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. జైలులో సేవలందించేందుకు ఇద్దరు కార్యకర్తలను నియమించుకున్నారని  జేడీయూ ఆరోపించింది. దాణా కుంభకోణం కేసులో ప్రస్తుతం ఆయన బిర్సా ముండా జైలులో ఉన్నారు.

ఈ కేసులో దోషిగా తేలటంతో న్యాయస్థానం మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఆయన్ను రాంచీ జైలుకు తరలించటానికి కొద్ది గంటల ముందే లక్ష్మణ్‌ మహతో, మదన్‌ యాదవ్‌ అనే నేరస్తులను అధికారులు అదే జైలుకు పంపారు. ఆ ఇద్దరూ ఆర్జేడీ కార్యకర్తలనీ తనకు సేవలు చేసేందుకు, వండి పెట్టేందుకు లాలూ నియమించుకున్నారని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్‌ కుమార్‌ పేర్కొన్నారు. దీన్ని ఆర్జేడీ పార్టీ అధికార ప్రతినిధి శక్తిసింగ్‌ యాదవ్‌ ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement