గుజరాత్లో కుప్పకూలిన నేవీ డ్రోన్
సాక్షి, పోర్బందర్ : గుజరాత్లోని పోర్బందర్ వద్ద భారతీయ వాయుసేనకు చెందిన డ్రోన్ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. గురువారం ఉదయం పదిగంటలకు పోర్బందర్ ఎయిర్బేస్లో టేక్ఆఫ్ అయిన కొద్దిసేపటికే డ్రోన్ నేలకొరిగింది. డ్రోన్ ప్రమాదం చోటుచేసుకుందని అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని భారత నేవీ నిర్ధారించింది.
ఇంజన్ వైఫల్యం కారణంగానే డ్రోన్ కుప్పకూలినట్టు ప్రాధమికంగా తెలియవచ్చిందని నేవీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాద ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం, ప్రాణనష్టం లేకపోవడంతో వాయుసేన వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
మరిన్ని వార్తలు