లార్జీ ప్రాజెక్టు అధికారులపై కేసు | Himachal tragedy: Case against project authorities | Sakshi
Sakshi News home page

లార్జీ ప్రాజెక్టు అధికారులపై కేసు

Jun 11 2014 12:59 PM | Updated on Sep 2 2017 8:38 AM

లార్జీ ప్రాజెక్టు అధికారులపై కేసు

లార్జీ ప్రాజెక్టు అధికారులపై కేసు

లార్జీ హైడ్రోపవర్ ప్రాజెక్టు అధికారులపై కేసు నమోదు చేశారు.

మండి: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో లార్జీ హైడ్రోపవర్ ప్రాజెక్టు అధికారులపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంతో ఇతరుల మరణానికి కారణమయ్యారనే అభియోగాలు మోపుతూ 336, 304-ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం మండి జిల్లా ఎస్పీ ఆర్ఎస్ నేగి ఈ విషయం వెల్లడించారు.

హైదరాబాద్కు చెందిన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బియాస్ నదిలో గల్లంతైన సంగతి తెలిసిందే. వీరిలో ఆరుగురి మృతదేహాలను వెలికితీయగా, మిగిలినవారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement