కశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్తత | high tension situation in kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్తత

Sep 4 2016 12:17 PM | Updated on Sep 4 2017 12:18 PM

కశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్తత

కశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్తత

అఖిలపక్ష బృందం పర్యటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. షోపియాన్లో ఆందోళనకారులు ప్రభుత్వ భవనానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. ఆందోళనకారులు భద్రతాబలగాల పైకి రాళ్లు విసరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుర్హాన్ వాని ఎన్‌కౌంటర్ నేపథ్యంలో చెలరేగిన అల్లర్లు 58 వ రోజుకు చేరుకోగా సుమారు 70 మంది మృతి చెందారు.

కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష బృందం ఇవాళ కశ్మీర్ చేరుకున్న నేపథ్యంలో ఈ ఘర్షణలు చెలరేగడం గమనార్హం. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, గవర్నర్‌తో అఖిలపక్షం నేడు భేటీ కానుంది. అలాగే అక్కడి రాజకీయ పార్టీలతోనూ అఖిలపక్షం సమావేశం కానుంది. కాగా జమ్మూకశ్మీర్‌లో జమ్మును ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలనే కొత్త డిమాండ్ వినిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement