బస్సు - ట్రక్ ఢీ: నలుగురు మృతి | Four killed, 20 injured as mini bus-truck collides | Sakshi
Sakshi News home page

బస్సు - ట్రక్ ఢీ: నలుగురు మృతి

Aug 29 2015 7:26 PM | Updated on Sep 3 2017 8:21 AM

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కకొరి ప్రాంతంలో శనివారం మినీ బస్సు ట్రక్ను డీ కొట్టింది.

లక్నో:  ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కకొరి ప్రాంతంలో శనివారం మినీ బస్సు ట్రక్ను డీ కొట్టింది. అనంతరం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను కింగ్ జార్జి మెడికల్ యూనివర్శిటీలోని ట్రూమా సెంటర్కు తరలించినట్లు వెల్లడించారు. క్షతగాత్రుల వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement