breaking news
mini bus-truck collides
-
ఘోర ప్రమాదం.. 12 మంది మృతి
ముంబయి: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ మినీ బస్సు ఓ కంటైనర్ను ఢీ కొట్టిన ఘటనలో 12 మంది మరణించారు. దాదాపు 23 మంది గాయాలపాలయ్యారు. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై అర్ధరాత్రి 12:30 సమయంలో ఈ ఘటన జరిగింది. 35 మందితో ప్రయాణిస్తున్న మినీ బస్సు సమృద్ధి ఎక్స్ప్రెస్లో అర్ధరాత్రి ప్రయాణిస్తుండగా ముంబయికి 350 కిలోమీటర్ల దూరంలో వైజపూర్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ అదుపుతప్పి కంటైనర్ను వెనక భాగంలో ఢీకొట్టాడు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో 5గురు పురుషులు, 6గురు మహిళలు కాగా ఓ మైనర్ బాలిక కూడా ఉంది. 23 మంది క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలిచారు. మరణాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: భారత్కు చేరిన మూడో విమానం -
బస్సు - ట్రక్ ఢీ: నలుగురు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కకొరి ప్రాంతంలో శనివారం మినీ బస్సు ట్రక్ను డీ కొట్టింది. అనంతరం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను కింగ్ జార్జి మెడికల్ యూనివర్శిటీలోని ట్రూమా సెంటర్కు తరలించినట్లు వెల్లడించారు. క్షతగాత్రుల వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.