
గవర్నర్ కు మర్యాదపూర్వక ఆహ్వానం..
తాత్కాలిక గవర్నర్ గా నియమితులైన సీ హెచ్ విద్యాసాగర్ రావును రియర్ అడ్మిరల్ అలోక్ భట్నాగర్.. మర్యాదపూర్వక సమావేశానికి ఆహ్వానించారు.
చెన్నైః తమిళనాడు, పుదుచ్చేరి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ రియర్ అడ్మిరల్ అలోక్ భట్నాగర్.. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును ఓ మర్యాదపూర్వక సమావేశానికి ఆహ్వానించినట్లు రాజ్ భవన్ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. అలాగే తాత్కాలిక గవర్నర్ గా నియమితులైన సీ హెచ్ విద్యాసాగర్ రావును అభినందించేందుకు ఆర్కాట్ ప్రిన్స్ నవాబ్ మొహమ్మద్ అబ్దుల్ అలి సైతం ఆహ్వానించినట్లు మరో ప్రకటనలో తెలిపారు. ఇంతకు ముందు గవర్నర్ గా ఉన్న కొణిజేటి రోశయ్య పదవీ కాలం ముగియడంతో తమిళనాడు తాత్కాలిక గవర్నర్ గా మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు నియమితులైన విషయం తెలిసిందే.