‘జాతీయ సవాలుగా కేసుల పరిష్కారం’ | Clearing pending cases national challenge for judiciary: CJI | Sakshi
Sakshi News home page

‘జాతీయ సవాలుగా కేసుల పరిష్కారం’

Aug 20 2016 2:18 PM | Updated on Sep 4 2017 10:06 AM

పెండింగ్ కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థకు జాతీయ సవాలుగా మారిందని జస్టిస్ టీఎస్ ఠాకూర్ చెప్పారు.

సిమ్లా: దేశ వ్యాప్తంగా పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థకు జాతీయ సవాలుగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ చెప్పారు.

సిమ్లాలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన సందర్భంగా మాట్లాడుతూ... కేసుల పెండింగ్ వల్ల న్యాయవ్యవస్థ మొత్తంపై విమర్శలు వస్తున్నాయన్నారు. ‘80 శాతం అపరిష్కృత కేసుల్లో అత్యధికం ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉన్నాయి’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement