మోదీ కేబినెట్‌ తుది భేటీలో కీలక నిర్ణయాలు

Cabinet Approves Proposal For Promulgation Of  Central Educational Institutions Ordinance - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ రానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన తుది కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని అనధికార కాలనీల్లో స్ధానికులకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు ఓ కమిటీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఉన్నత విద్యాసంస్ధల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి కేంద్ర విద్యా సంస్థల ఆర్డినెన్స్‌ 2019కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సమస్యలు ఎదుర్కొంటున్న థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను చక్కదిద్దేందుకు మంత్రుల బృం‍దం​చేసిన సిఫార్సులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోద ముద్ర వేసింది. దేశంలో చెరుకు రైతులను ఆదుకునేందుకు షుగర్‌ మిల్లులకు రూ 2790 కోట్ల అదనపు నిధుల కేటాయింపును కేబినెట్‌ ఆమోదించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top