మాంఝీ పార్టీకి 20 సీట్ల కేటాయింపు | Bihar polls: We have arrived at a seat-sharing deal with our allies, says BJP chief Amit Shah | Sakshi
Sakshi News home page

మాంఝీ పార్టీకి 20 సీట్ల కేటాయింపు

Sep 14 2015 1:33 PM | Updated on Jul 18 2019 2:11 PM

మాంఝీ పార్టీకి 20 సీట్ల కేటాయింపు - Sakshi

మాంఝీ పార్టీకి 20 సీట్ల కేటాయింపు

ఎన్డీఏలో సీట్ల పంపకాలపై ప్రతిష్టంభన తొలగింది. హిందుస్తాన్ అవామ్ మోర్చా(హెచ్‌ఏఎం) అధినేత జితిన్ రాం మాంఝీతో బీజేపీ చర్చలు సఫలం అయ్యాయి.

న్యూఢిల్లీ : ఎన్డీఏలో సీట్ల పంపకాలపై ప్రతిష్టంభన తొలగింది. బిహార్ ఎన్నికల్లో  బీజేపీ హెచ్ఏఎం మధ్య పొత్తు కుదిరింది.  రెండు పార్టీల సీట్ల మధ్య సర్దుబాటుపై   చర్చలు సఫలం అయ్యాయి.  హిందుస్తాన్ అవామ్ మోర్చా(హెచ్‌ఏఎం) అధినేత జితిన్ రాం మాంఝీ ఒత్తిడికి బీజేపీ తలొగ్గింది. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాల్లో భాగంగా మాంఝీ పార్టీకి 20 సీట్లు కేటాయించింది.

 

ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారమిక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు. బిహార్ ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా బిహార్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఫలితాల తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. కాగా మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో 160 సీట్లకు బీజేపీ పోటీ చేస్తోంది. కాగా బీజేపీ ....హెచ్‌ఏఎంకు-20,ఎల్జేడీకి-40, ఆర్ఎస్ఎస్పీకి-23 సీట్లు కేటాయించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement