నగదు మార్చుకోగానే ఇంక్ మార్క్! | after money exchange ink mark is must, says shaktikanta das | Sakshi
Sakshi News home page

నగదు మార్చుకోగానే ఇంక్ మార్క్!

Nov 15 2016 12:51 PM | Updated on Sep 22 2018 7:51 PM

నగదు మార్చుకోగానే ఇంక్ మార్క్! - Sakshi

నగదు మార్చుకోగానే ఇంక్ మార్క్!

పెద్దనోట్ల రద్దు వల్ల కొంతమంది వ్యక్తులు బ్యాంకులకు వెళ్లి పదే పదే డబ్బులు మారుస్తున్నారని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు.

ఢిల్లీ: పెద్దనోట్ల రద్దు వల్ల కొంతమంది వ్యక్తులు బ్యాంకులకు వెళ్లి పదే పదే డబ్బులు మారుస్తున్నారని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. కొందరు వ్యక్తులు ఈ విధంగా పదే పదే బ్యాంకులకు రావడంతో ఇతరులకు అవకాశం లేకుండా చేస్తున్నారని.. దీన్ని నిరోధించడంలో భాగంగా ఇంక్ మార్క్ వేయనున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. కొందరు వ్యక్తులు పదే పదే రావడం వల్లే బ్యాంకుల వద్ద రద్దీ బాగా పెరిగిందని, నల్లధనం ఉన్న వ్యక్తులు పెద్ద సంఖ్యలో వ్యక్తులను బ్యాంకులకు పంపిస్తున్నారని శక్తికాంత్ దాస్ చెప్పారు. జన్‌ధన్ అకౌంట్లలో రూ.50 వేలు వరకు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement