విద్యార్థులను దోచుకున్నారు | 3 students robbed of car, valuables | Sakshi
Sakshi News home page

విద్యార్థులను దోచుకున్నారు

Apr 12 2015 11:32 AM | Updated on Sep 3 2017 12:13 AM

ఉత్తరప్రదేశ్లో కొందరు దుండగులు ముగ్గురు విద్యార్థులను దోచుకున్నారు. వారు ప్రయాణీస్తున్న కారును ఎత్తుకెళ్లిపోయారు.

ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లో కొందరు దుండగులు ముగ్గురు విద్యార్థులను దోచుకున్నారు. వారు ప్రయాణీస్తున్న కారును ఎత్తుకెళ్లిపోయారు. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాకు చెందిన న్యాయశాస్త్రం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు డెహ్రాడూన్-న్యూఢిల్లీ జాతీయ రహదారి గుండా డెహ్రాడూన్కు వస్తుండగా సిసోనా అనే గ్రామ శివారులోని ఓ డాబా వద్ద కారును ఆపారు. విశ్రాంతి తీసుకొని బయలుదేరుతుండగా ఆయుధాలతో వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. వారి ఆయుధాలతో బెదిరించి బలవంతంగా కిందికి దించారు. అనంతరం వద్ద నుంచి విలువైన వస్తువులు తీసుకొని కారును కూడా ఎత్తుకెళ్లిపోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement