మహిళలు తిరగబడితే?

Trinetri Movie Shooting Completed - Sakshi

మేఘన, ఆరోహి, వృశాలి, పోసాని కృష్ణమురళి ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘త్రినేత్రి’. తిరుపతి కె. వర్మ దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట్‌ రెడ్డి, కాచిడి గోపాల్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. తిరుపతి కె. వర్మ మాట్లాడుతూ–  ‘‘ఆడవాళ్లపై జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. మహిళలు తిరగబడితే ఎలా ఉంటుంది? అన్నదే కథ. పోసానిగారి పాత్ర ఈ సినిమాకి హైలైట్‌గా ఉంటుంది. త్వరలో ట్రైలర్‌ విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘పోసానిగారు మా సినిమా కథ విని చాలా బాగుంది, కచ్చితంగా మంచి హిట్‌ అవుతుందన్నారు’’ నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: ఎడవెల్లి రాంరెడ్డి, కెమెరా: చారి,  సంగీతం: జయంత్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top