గుడి గంట మోగింది

Taapsee Pannu visits Golden Temple to seek blessings before she starts shooting for the film - Sakshi

బాలీవుడ్‌ స్పైస్‌

మనసు ఏం కోరుకుంటే అది జరగాలనుకుంటాం. ప్రస్తుతం తాప్సీ ఒక్క కోరిక కోరుకున్నారు. అది పెళ్లి గురించి కాదు. సినిమా హిట్టవ్వాలని మనసులో అనుకున్నారు. ఆ కోరిక నెరవేర్చమని దేవుణ్ణి కోరారు. ఈ ఢిల్లీ బ్యూటీ ప్రస్తుతం ‘మన్‌మర్జియా’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. అంటే.. మనసుకి ఇష్టమైనది అని అర్థం. ఈ సినిమా కోసమే తాప్సీ అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌కి వెళ్లారు. సినిమా స్టార్ట్‌ అవ్వడానికి ముందు గుడి గంట మోగించి, మంచి జరగాలని కోరుకున్నారు.

అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో అభిషేక్‌ బచ్చన్, తాప్సీ, విక్కీ కుశాల్‌ ముఖ్య తారలుగా నటిస్తున్న సినిమా ‘మన్‌మర్జియా’. ఈ సినిమా షూటింగ్‌ను ప్రేమికుల రోజున అమృత్‌సర్‌లో స్టార్ట్‌ చేశారు. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను ఆల్మోస్ట్‌ టు మంత్స్‌ అమృత్‌సర్‌లో షూట్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. స్వామికార్యం స్వకార్యం అన్నట్లు.. అక్కడి గుడి సందర్శించి, తొలి సీన్‌కి క్లాప్‌ కొట్టడానికి ముందే గుడి గంట మోగించారు తాప్సీ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top