దాదాపు 13 ఏళ్ల తర్వాత నానా పటేకర్ మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. విలక్షణ నటునిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, 1991లో ‘ప్రహార్: ది ఫైనల్ ఎటాక్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా తర్వాత నానా పటేకర్ మళ్లీ దర్శకత్వం చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆయనకు మళ్లీ డెరైక్షన్ చేయాలనిపించింది. సంఘ సేవకుడు స్వర్గీయ బాబా ఆమ్టే జీవితం ఆధారంగా ఆయన ఈ చిత్రం చేయనున్నారు. హిందీ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం బాబా, ఆయన తనయుడు డా.ప్రకాశ్ పాత్రల చుట్టూ ప్రధానంగా తిరుగుతుంది.
ఈ రెండు పాత్రలనూ నానా పటేకరే పోషించనున్నారు. కాగా, ఇటీవల విడుదలైన మరాఠీ చిత్రం ‘డా. ప్రకాశ్ బాబా ఆమ్టే: ది రియల్ హీరో’లో ప్రకాశ్ పాత్రను నానా పటేకర్ చేశారు. గత నెల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా దూసుకెళుతోంది. వాస్తవానికి ఈ చిత్రంలో కూడా నానా పటేకర్ను బాబా ఆమ్టే పాత్ర చేయమన్నారు. దాని గురించి నానా పటేకర్ చెబుతూ -‘‘బాబా జీవితం ఆధారంగా సినిమా చేయడానికి గత కొంత కాలంగా పరిశోధనలు జరుపుతున్నాను. నేను దర్శకత్వం వహించే చిత్రంలోనే ఆ పాత్ర చేయాలనుకున్నాను.
అందుకే అంగీకరించలేదు. బాబా ఆమ్టే రెజ్లర్ కాబట్టి, చాలా దృఢంగా ఉండేవారు. అందుకని, నా శరీరాకృతిని మార్చుకోవడానికి గత కొన్నాళ్లుగా కసరత్తులు చేస్తున్నా’’ అని చెప్పారు. నానాకి ఇప్పుడు 63 ఏళ్లు. ఈ వయసులో కండలు పెంచడం, శరీరాకృతిని మార్చుకోవడమంటే చిన్న విషయం కాదు. ఒక పాత్రకు న్యాయం చేయడానికి నానా పటేకర్ ఎంత పట్టుదలగా ఉంటారో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ని ప్రారంభించాలనుకుంటున్నారు.
స్వీయ దర్శకత్వంలో వెండితెరపై బాబా ఆమ్టేగా...
Published Wed, Nov 26 2014 10:29 PM
Related news
-
ఆ దెబ్బతో రోడ్డున పడ్డాం.. నెలకు రూ.35తో కుటుంబమంతా..
ప్రముఖ నటుడు, పద్మ శ్రీ గ్రహీత నానా పటేకర్ ఎన్నో కష్టాలను దాటుకుని ఈ స్థాయికి వచ్చాడు. ఎక్కువగా హిందీ, మరాఠి భాషల్లో నటించిన ఆయన మూడు జాతీయ, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు. రెండు మూడు సినిమాల్లో పాటలు కూడా పాడాడు. డైరెక్టర్గా 'ప్రహార్: ద ఫైనల్ అటాక్' అనే సినిమా కూడా తీశాడు. 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ఈయన 28 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత మొదటి కొడుకునూ కోల్పోయాడు. తాజాగా అతడు చిన్నతనంలో పడ్డ కష్టాలను ఏకరువు పెట్టాడు. దివాలా తీశాం.. 'ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య తండ్రీ పిల్లల మధ్య దూరం పెరుగుతోంది. మా చిన్నతనంలో ఇలా ఉండేది కాదు. బయటకు ప్రేమ చూపించుకోకపోయినా అది మా మధ్య అంతర్లీనంగా ఉండేది. మా నాన్న మా కోసం కష్టపడుతున్నాడన్న విషయం మాకు అర్థమయ్యేది. ఓసారి మా నాన్న వ్యాపారాన్ని ఎవరో లాక్కోవడంతో మేము దివాలా తీశాం. అప్పటివరకు ధనవంతుడైన మా నాన్న ఆ దెబ్బతో నడివీధిలో నిలబడాల్సి వచ్చింది. తను దిగాలుగా, ఏదో శిక్ష పడిన ఖైదీలా కూర్చునేవాడు. ఒక్క పూట భోజనం.. ఆకలి.. అది చూసి నేను ఎందుకు నాన్న, అంత దిగులు చెందుతున్నావు? నీకు ఒక ఫ్యాక్టరీనే కదా పోయింది.. వదిలెయ్.. నీకింకా రెండు ఫ్యాక్టరీలున్నాయి. ఒకటి అన్నయ్య, రెండు నేను. ఎక్కువగా ఆలోచించకు, అంతా సర్దుకుంటుంది అని నచ్చజెప్పాను. 13 ఏళ్ల వయసులోనే పనికి వెళ్లడం మొదలుపెట్టాను. నెలంతా పని చేస్తే రూ.35 ఇచ్చేవారు, రోజుకు ఒక పూట భోజనం పెట్టేవారు. రాత్రిపూట భోజనం చేసేటప్పుడు ఇంటి దగ్గర అమ్మ, నాన్న తిన్నారా? లేదా? అన్న అనుమానం వచ్చేది. కానీ ఆకలికి ఆగలేక నేను తినేసేవాడిని' అని చెప్పుకొచ్చాడు. ఆరోపణలతో నటుడిపై మరక! చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యక స్థానం సంపాదించుకున్న నానా పటేకర్ మీద నటి తనుశ్రీ దత్తా.. లైంగిక ఆరోపణలు చేసింది. మీ టూ ఉద్యమ సమయంలో ఆమె చేసిన ఆరోపణలు నిజమని రుజువు కాకపోయినప్పటికీ నానా మీద విమర్శలు వెల్లువెత్తాయి దీంతో కొంతకాలం పాటు ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యే వ్యాక్సిన్ వార్లో కనిపించిన అతడు 'లాల్ బత్తి' అనే ఓటీటీ మూవీ చేస్తున్నాడు. అలాగే మరాఠీలో 'ఒలె ఆలె' అనే చిత్రంలో నటిస్తున్నాడు. చదవండి: అమ్మ గదిలో దొంగతనం.. నా కొడకా.. అని తిట్టేది! -
ఆ అబ్బాయిని నేను కొట్టలేదు.. ఏం జరిగిందంటే: నానా పటేకర్
బాలీవుడ్లో తన నటనతో ఎనలేని ప్రశంసలు దక్కించుకున్నాడు నానా పటేకర్.. కానీ ఆయన నిజ జీవితంలో అప్పుడప్పుడు వివాదంలో చిక్కుకుంటుంటాడు. కొద్దిరోజుల క్రితం ‘ది వ్యాక్సిన్ వార్’తో ప్రేక్షకులను అలరించాడు నానా పటేకర్. సినిమా షూట్లో భాగంగా ఆయన వారణాసిలో తాజాగా పర్యటించాడు. వారణాసి వీధుల్లో షూటింగ్ జరుగుతోన్న సమయంలో ఓ అభిమాని నానా పటేకర్ కనిపించగానే ఫోన్ పట్టుకుని సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్లాడు. అంతే.. ఆ నటుడు కోపంతో గట్టిగా తల మీద ఒక్కటిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నానా పటేకర్ దురుసు ప్రవర్తనను తప్పుపట్టారు. ఈ వివాదంపై ఆ చిత్ర దర్శకనిర్మాత అనిల్ శర్మ ఇలా స్పందించాడు. 'సినిమాలో నానా పటేకర్ మానసిక స్థితి బాగలేని పాత్రలో కనిపిస్తారు. గుంపులో ఉన్న ఆ వ్యక్తితో సెల్ఫీకోసం ఒకరు రావడం. తనను ఆ వ్యక్తి కొట్టడం. ఇదంతా షూటింగ్లో భాగం మాత్రమే' అని అన్నారు. క్షమించమని కోరిన నానా పటేకర్ 'నేను ఒక అబ్బాయిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీక్వెన్స్ మా సినిమాలో భాగమే అయినప్పటికీ, మేము ఒక రిహార్సల్ చేశాము... మేము రెండవ రిహార్సల్ చేయడానికి షెడ్యూల్ చేశాము. దర్శకుడు స్టార్ట్ అనగానే. వీడియోలోని అబ్బాయి లోపలికి వచ్చాడు. అప్పుడు కెమెరా ముందు మేము నటించేందకు సిద్ధంగా ఉన్నాము. అతను ఎవరో నాకు తెలియదు, అతను మా సిబ్బందిలో ఒకడని భావించాను కాబట్టి నేను చెంపదెబ్బ కొట్టాను. సీన్ ప్రకారం అతన్ని వెళ్లిపొమ్మని కూడా అప్పుడు చెప్పాను. తర్వాత, అతను సిబ్బందిలో భాగం కాదని నాకు తెలిసింది. (ఇదీ చదవండి: నితిన్ సినిమాను నాన్న ఎందుకు ఒప్పుకున్నారంటే: శివాని రాజశేఖర్) కాబట్టి, నేను వెంటనే అతనిని తిరిగి పిలిచాను కూడా.. కానీ అతను అప్పటికే వెళ్లిపోయాడు. బహుశా అతని స్నేహితుడు ఈ వీడియో చిత్రీకరించి ఉంటాడు. నేను. ఫోటో కోసం ఎవ్వరితోనూ ఇప్పటి వరకు నో చెప్పలేదు. నేను ఇలా చేసే వ్యక్తిని కాదు. పొరపాటున ఇలా జరిగింది. నేను అర్థం చేసుకోవడంలో తప్పు జరిగింది. ఈ వీడియో ద్వారా నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి. నేను ఇలాంటివి ఎప్పటికీ చేయను.' అని ఆయన అన్నాడు. #WATCH | On a viral showing him slapping a boy for taking a selfie with him, actor Nana Patekar says, "A video is going viral where I have hit a boy. Though this sequence is a part of our film, we had one rehearsal...We were scheduled to have a second rehearsal. The director told… pic.twitter.com/CVgCainRg1 — ANI (@ANI) November 16, 2023 वाराणसी - नाना पाटेकर ने अपने फैंस को जड़ा थप्पड़ , फिल्म की शूटिंग के दौरान सेल्फी लेने पहुंचा था फैंस ➡नाना पाटेकर ने थप्पड़ जड़कर फैंस को भगाया ➡सोशल मीडिया पर वायरल हुआ थप्पड़ मारने का वीडियो ➡वाराणसी में नाना पाटेकर कर रहे हैं फिल्म जर्नी की शूटिंग. #Varanasi pic.twitter.com/tlPS1QX9g9 — Dinesh Kumar (@DineshKumarLive) November 15, 2023 -
సెల్ఫీ కోసం వెళ్తే తల మీద ఒక్కటిచ్చిన నటుడు, వీడియో వైరల్
అభిమాన తారలు కనిపిస్తే చాలు ఫోటో దిగాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతుంటారు జనాలు. కొందరు సెలబ్రిటీలు ఓపికగా చిరునవ్వుతో వారికి సెల్ఫీ ఇవ్వడానికి ముందుకొస్తే మరికొందరు మాత్రం అభిమానులను పట్టించుకోకుండా హడావుడిగా వెళ్లిపోతుంటారు. అయితే ప్రముఖ నటుడు నానా పటేకర్ మాత్రం తనతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించిన అభిమానిని ఫట్మని కొట్టాడు. మెడ పట్టి గెంటేశారు ఓ అభిమాని నానా పటేకర్ కనిపించగానే ఫోన్ పట్టుకుని సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్లాడు. అంతే.. ఆ నటుడు కోపంతో తల మీద ఒక్కటిచ్చాడు. అక్కడున్న సెక్యూరిటీ కూడా అతడిని మెడ పట్టుకుని అవతలకు తోశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నానా పటేకర్ దురుసు ప్రవర్తనను ఎండగడుతున్నారు. సెల్ఫీ ఇవ్వడం ఇష్టం లేకపోతే కుదరదని సౌమ్యంగా చెప్పొచ్చుగా, ఎందుకలా కొట్టడం అని విమర్శిస్తున్నారు. ఆయన చేసింది ముమ్మాటికీ తప్పేనని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఘటన వారణాసిలో జరిగినట్లు తెలుస్తోంది. సినిమాల సంగతి.. కాగా మీటూ ఉద్యమం సమయంలో నానా పటేకర్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తనుశ్రీ దత్తా ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కానీ విచారణలో తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని తేలింది. ఏదేమైనా మీటూ వివాదం ఆయన కెరీర్కు మచ్చ తెచ్చింది. దీంతో కొంతకాలం మీడియాకు, సినిమాలకు దూరగా ఉన్న ఆయన అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఆయన చివరగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ద వ్యాక్సిన్ వార్ సినిమాలో నటించాడు. वाराणसी - नाना पाटेकर ने अपने फैंस को जड़ा थप्पड़ , फिल्म की शूटिंग के दौरान सेल्फी लेने पहुंचा था फैंस ➡नाना पाटेकर ने थप्पड़ जड़कर फैंस को भगाया ➡सोशल मीडिया पर वायरल हुआ थप्पड़ मारने का वीडियो ➡वाराणसी में नाना पाटेकर कर रहे हैं फिल्म जर्नी की शूटिंग. #Varanasi pic.twitter.com/tlPS1QX9g9 — Dinesh Kumar (@DineshKumarLive) November 15, 2023 చదవండి: చైతూ తొలి వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు? -
The Vaccine War: 'ది వ్యాక్సిన్ వార్' మూవీ రివ్యూ
టైటిల్: ది వ్యాక్సిన్ వార్ నటీనటులు: నానా పటేకర్,అనుపమ్ ఖేర్,పల్లవి జోషి,రైమా సేన్,గిరిజా ఓక్,సప్తమి గౌడ తదితరులు నిర్మాణ సంస్థ: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాతలు: పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం: వివేక్ అగ్నిహోత్రి సంగీతం: రోహిత్ శర్మ, వనరాజ్ భాటియా సినిమాటోగ్రఫీ: ఉదయసింగ్ మోహితే ఎడిటర్: శంఖ రాజాధ్యక్ష విడుదల తేది: సెప్టెంబర్ 28, 2023 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాతో దేశ మొత్తం తన గురించి చర్చించుకునేలా చేసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్లో పలు సినిమాలు చేసినా ఆయనకు గుర్తింపు వచ్చింది మాత్రం ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతోనే. సున్నితమైన సమస్య చుట్టూ ఈ కథని చెప్పడం వలన కొంతమంది మనోభావాలు దెబ్బతింటే, హిందుత్వ సంఘాల, పలు సమూహాలకి బాగా కనెక్ట్ అయ్యింది. అంతేకాకుండా ఆ సినిమాపై భారీ విమర్శలు కూడా వచ్చాయి. ఇలా ఆ సినిమా తర్వాత ఆయన నుంచి తాజాగా విడుదలైన చిత్రం 'ది వ్యాక్సిన్ వార్' కరోనావైరస్ వ్యాప్తి భూ గ్రహం మీద ఉన్న ప్రతి వ్యక్తి జీవితాలను ప్రభావితం చేసింది. ఆ సమయంలో విధించిన లాక్డౌన్ వల్ల వివిధ వర్గాల ప్రజల దుస్థితి ఎలా ఉంది.. వ్యాక్సిన్ తయారు చేసేందుకు చాలామంది శాస్త్రవేత్తలు ఎందుకు వెనకడుగు వేశారు..? అలాంటి సమయంలో తామున్నామని మహిళా శాస్త్రవేత్తలు ముందు అడుగు వేయడానికి గల కారణాలు ఏంటి..? వ్యాక్సిన్ తయారు చేయడం ఇండియా వల్ల కాదని ఎందరో చెబుతున్నా.. కేవలం ఏడు నెలల సమయంలో స్వంత వ్యాక్సిన్ను భారత్ ఎలా తయారు చేయగలిగింది..? వ్యాక్సిన్ తయారు చేస్తున్న సమయంలో శాస్త్రవేత్తల దుస్థితి ఎలా ఉంది..? ఇవన్నీ తెలియాలంటే వివేక్ రంజన్ అగ్నిహోత్రి 'ది వ్యాక్సిన్ వార్'లోకి వెళ్లాల్సిందే. 'ది వ్యాక్సిన్ వార్' కథేంటంటే.. ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మాజీ డైరెక్టర్ జనరల్, డాక్టర్ బలరామ్ భార్గవ్ రాసిన 'గోయింగ్ వైరల్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని అగ్నిహోత్రి తెరకెక్కించారు. వాక్సిన్ వార్, వాస్తవ ప్రపంచంలో జరిగిన ఘటనలతో సినిమా ప్రారంభం అవుతుంది. ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ భార్గవ (నానా పటేకర్) తన శాస్త్రవేత్తల బృందంతో న్యుమోనియా లాంటి వ్యాక్సిన్లను తయారు చేసే పనిలో ఉంటారు. అందుకు కావాల్సిన ఆయన ఒక టీమ్ను సమీకరించుకుంటారు. అదే సమయంలో నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ (NIV) హెడ్గా డాక్టర్ అబ్రహం (పల్లవి జోషి పోషించారు) వీరందరి నేతృత్వంలో భారత్ కోసం పలు వ్యాక్సిన్ల తయారిలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఆ సమయంలో భారతదేశంతో పాటు.. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా కోవిడ్-19 మహమ్మారి బారిన పడుతాయి. ప్రజలందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. ఈ కథనాలను ప్రజలకు చేరవేసేందుకు మీడియా కూడా ప్రాణలకు తెగించే పని చేస్తుంటుంది. నెగటివ్ జర్నలిస్టు పాత్రలో (రైమా సేన్) అనేక నిజ జీవితాలను వెలికితీస్తూనే కొన్ని తప్పుడు వార్తలను కూడా ప్రచురిస్తూ ఉంటుంది. ఆమె నేతృత్వంలోని మీడియాకు చెందిన ఒక విభాగం హానికరమైన తప్పుడు వార్తల ప్రచారం చేస్తూ.. శాస్త్రవేత్తలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఆమెతో పోరాడుతూ.. వైరస్కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ను తయారు చేయడానికి శాస్త్రవేత్తల బృందం ఎలాంటి అడ్డంకులను దాటింది. అనేది కథలో కీలకంగా ఉంటుంది. వ్యాక్సిన్ తయారిలో భాగం అయ్యేందుకు చాలామంది పురుష శాస్త్రవేత్తలు వెనకడుగు వేస్తారు. అలాంటి సమయంలో మహిళా శాస్త్రవేత్తలు ముందుకు వస్తారు. ఇందులో డాక్టర్ భార్గవ పాత్ర కథలో కీలకంగా ఉంటుంది. వ్యాక్సిన్ తయారి సమయంలో ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉంది..? ఆ సమయంలో ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత వచ్చింది..? ది వ్యాక్సిన్ వార్ సినిమా మన వ్యాక్సిన్ సిస్టం.. మన మెడికల్ సిస్టం నిజస్వరూపాన్ని చూపెట్టిందా..? విపత్కర పరిస్థితుల్లో భారత్ ఎలా పోరాడింది. శాస్త్రవేత్తలను అణగదొక్కడమే తమ లక్ష్యంగా పనిచేసింది ఎవరు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మనం చేయలేము.. అనుకునే స్థాయి నుంచి మనం చేయగలం అనే స్థాయికి చేరుకుని.. చేసి చూపించారు మన శాస్త్రవేత్తలు. ఒక్కముక్కలో చెప్పాలంటే ది వ్యాక్సిన్ వార్ సారాంశం ఇదే. సినిమా కథ విషయానికి వస్తే అద్బుతంగా ఉంది. మానవ మెదడుకి మెమోరీ తక్కువగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా టైంలో జరిగిన వాటిని మరిచిపోగలం. కానీ ఈ చిత్రం మాత్రం ఇండియా శాస్త్రవేత్తల మీద నమ్మకాన్ని పెంచుతుంది. వారి పట్ల గౌరవాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాను చూశాక మన శాస్త్రవేత్తలను చూసి గర్వపడేలా ఉంటుంది. సినిమాలో గమనించదగ్గ అంశం ఏమిటంటే, వివేక్ అగ్నిహోత్రి తన మునుపటి చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'పై ఎన్నో విమర్శలను అందుకున్నాడు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగకపోవచ్చు. కోవిడ్ -19 కేసులకు మైనారిటీలు ఎలా కారణం అయ్యారు.. దానిని వ్యాప్తి చేయడంలో వారు చేసిన తప్పు ఏంటి అనే కథనాన్ని స్పష్టంగా చూపించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో కుంభమేళా వేడుకలు, పలు ర్యాలీలతో పాటు డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తిని తెరపై చూపిస్తుంది. సినిమాలో రాజకీయ విషయానికి వస్తే అతను దానిని కొంతమేరకు బ్యాలెన్స్ చేశాడని చెప్పవచ్చు. ఇది ప్రభుత్వాన్ని సానుకూలంగా చూపుతుందనడంలో సందేహం లేదు. బలరామ్ భార్గవ్ (నానా పటేకర్ పోషించిన పాత్ర) తాను సైన్స్ అనుకూలుడని ప్రధానిని ప్రశంసించడం కనిపించింది. రెండవ వేవ్ సమయంలో వైరస్ వ్యాప్తికి రాజకీయ ర్యాలీలు కారణమని కూడా చిత్రంలో కనిపిస్తుంది. అటు ప్రభుత్వంపై సానుకూలతను చూపుతూనే.. కొంతమేరకు ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసిందో కూడా చిత్రంలో ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నిడివిగా అనిపిస్తుంది. ఇది సాధారణ ప్రేక్షకులకు విసుగు తెప్పించవచ్చు. అయితే సెకండాఫ్ వేగం పుంజుకుని చివరి వరకు మెయింటెన్ చేస్తుంది. ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాలో చిన్నపిల్లలు ఉన్న తల్లులు కూడా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ల్యాబ్లలోనే వారి జీవితాన్ని ఎలా గడిపారని చూపించారు. ఆ సీన్స్ మెప్పిస్తాయి. ఒక సాధారణ వ్యక్తికి వ్యాక్సిన్ గురించి పూర్తిగా తెలియదు. కానీ, ఈ సినిమా చూశాక దాని గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు. వ్యాక్సిన్ తయారు చేయడం కేవలం వాళ్ల ఉద్యోగం మాత్రమే కాదు. అది సైంటిస్ట్లు చేసిన నిస్వార్థమైన సేవ. వాళ్ల సమయాన్ని దేశం కోసం ఉపయోగించారు. ఇది అన్నింటికంటే ముఖ్యమైన విషయం. ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది. విదేశీ వ్యాక్సిన్లను భారత్లో ఎక్కువగా ప్రచారం చేయడం.. వారి వ్యాపార సామ్రాజ్యం కోసం జరుగుతున్న లాబీయింగ్ సీన్లు ప్రతి భారతీయుడిని ఆలోచింపచేస్తాయి. అందులో మీడియా పాత్ర ఏమేరకు ఉందనేది ప్రధాన చర్చకు దారితీస్తుంది. అంతేకాకుండా ‘భారత్కు వ్యాక్సిన్ తయారు చేయడం చేతకాదు’ అని మీడియా మొత్తం నమ్మిందా? అనేలా చిత్రీకరించిన సీన్లు కొంతమేరకు అభ్యంతరకంగా ఉన్నాయి. ఎవరెలా చేశారంటే.. సినిమాలో నానా పటేకర్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది. తన ప్రతిభకు తాను మాత్రమే అనేలా మరోసారి ఆయన నిరూపించుకున్నాడు. అతను ఏ పాత్రనైనా పోషించగలడని శాస్త్రవేత్తగా 100 మార్కులతో మెప్పిస్తాడు. ఒక శాస్త్రవేత్త బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది.. కీలక సమయాల్లో వారి యెక్క భావోద్వేగాలు ఏ విధంగా ఉంటాయో నానా పటేకర్ చూపించాడు. డాక్టర్ అబ్రహం పాత్రలో పల్లవి జోషి నటించింది. ఆమె ఒక మలయాళీ పాత్రను పోషిస్తుంది. సినిమాలో ఆమె ఉచ్చారణ బాగున్నా.. నానా పటేకర్తో వచ్చే సీన్లు అంతగా హైలెట్గా కనిపించవు. కానీ NVIలోని శాస్త్రవేత్తల మధ్య ఒత్తిడితో పాటు అనేక భావోద్వేగాలు కనిపిస్తాయి. అక్కడ ఆమె ప్రదర్శనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. సినిమా ఎడిటింగ్ మరింత పటిష్టంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఏది ఏమైనప్పటికీ, ఒక ప్రధాన లోపం ఏమిటంటే, మీడియాను ఏకపక్షంగా చిత్రీకరించడం అంతగా మెప్పించదు. మీడియా వల్లే నాడు కోవిడ్ సమయంలో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా తెలుసుకునే వారు. మీడియా కూడా ఫ్రంట్ వారియర్స్గా కరోనా విపత్తు సమయంలో పనిచేసింది. ఈ విషయాన్ని గుర్తించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అతను ఈ చలన చిత్రాన్ని ఒక రకమైన 'మీడియా యుద్ధం'గా పేర్కొన్నట్లు ఉంది. వాస్తవానికి, వ్యాక్సిన్పై నెగిటివ్ ఇమేజ్ని సృష్టించి, నకిలీ వార్తల ద్వారా దాని గురించి తప్పుడు కథనాన్ని అల్లడంపై నరకయాతన పడుతున్న జర్నలిస్ట్గా నటించిన రైమా సేన్, ఈ చిత్రంలో బలహీనమైన లింక్గా కనిపిస్తుంది. ఆమెను సరైన రీతిలో దర్శకుడు ఉపయోగించుకోలేకపోయాడు. శాస్త్రవేత్తలు, ప్రజల్లో కలిగే ఎమోషనల్ సీన్లు మాత్రం బాగా పండుతాయి. రాజకీయ సంఘర్షణలు తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. భారతీయ శాస్త్రవేత్తలు విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశారు. వారి కోసం ఈ సినిమాను ఖచ్చితంగా చూడవచ్చు. వారు తమ జీవితాల గురించి పట్టించుకోకుండా గొప్ప మంచికి ఎలా ప్రాముఖ్యతనిచ్చారనే దాని గురించి మీరు ఆలోచించేలా చేస్తుంది. ఇది వారి త్యాగాన్ని గుర్తు చేస్తూ థియేటర్ నుంచి మిమ్మల్ని ఇంటికి నడిపిస్తుంది. - బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్డెస్క్ -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్
‘ది కశ్మీరీ ఫైల్స్’ వంటి హిట్ మూవీ తర్వాత దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. నానా పటేకర్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, సప్తమి గౌడ, పరితోష్ సాండ్, స్నేహ మిలాండ్, దివ్య సేథ్ నటించారు. పల్లవి జోషి నిర్మించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది. మంగళవారం హిందీ ట్రైలర్ను విడుదల చేశారు. ‘‘భారతదేశపు మొట్టమొదటి బయో–సైన్స్ చిత్రమిది. కోవిడ్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నదే ఈ చిత్ర కథ’’ అని యూనిట్ పేర్కొంది. కాగా ‘వ్యాక్సిన్ వార్’ చిత్రం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ, భోజ్పురి, బెంగాలీ, మరాఠీ, తమిళ, కన్నడ, ఉర్దూ, అస్సామీ భాషల్లో విడుదల కానుంది.
Related News by category
-
తొమ్మిది నెలల కిందే బన్నీకి సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్..
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ను తొమ్మిది నెలల కిందే సాక్షి మీడియా గ్రూప్ ఎక్స్లెన్స్ అవార్డ్తో సత్కరించింది. పుష్ప సినిమాలో వినూత్నమైన నటనతో పాటు తెలుగు అభిమానులను అత్యద్భుతంగా అలరించినందుకు ఎక్స్లెన్స్ అవార్డ్తో గౌరవించింది. ఆ సందర్భంగా మాట్లాడిన స్టైలిష్ స్టార్.. సాక్షి మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్కు థ్యాంక్యూ చెప్పారు. సాక్షి ఇచ్చిన ఎక్స్లెన్స్ అవార్డ్ను మూవీ టీంకు డెడికేట్ చేస్తున్నట్లు చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు. ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్లో అల్లు అర్జున్కు మోస్ట్ పాపులర్ హీరో అవార్డ్.. -
Hello Meera Movie: హాలో మీరా.. దర్శకుడి గొప్ప ప్రయోగమిది!
రాతి పులుసు 'అనే యూరప్ జానపద కథ ఒకటి ఉన్నది. భలే చమత్కారమైన కథ. వీలయినంత గుర్తున్నది చెప్పడానికి ప్రయత్నిస్తా రండి.' ఒకానొక మనిషి కాలినడకన తోవ పట్టుకు పోతున్నాడు. ఎక్కడికో తెలీదు. నడిచీ నడిచీ కడుపులో దహించుకుపోయేంత ఆకలి. మనిషి మట్టి కొట్టుకు పోయి ఉన్నాడు. జేబులో నాలుగు డబ్బులు ఉండి ఉంటే ఏ బండి చక్రాన్నో పట్టుకునేవాడు. ఆ మాత్రం కూడా లేనట్టు ఉంది. నడవగా నడవగా ఒక ఊరు తగిలింది. మొదట కనపడిన ఇంటి తలుపు ముందు నిలబడి తినడానికి ఏమైనా ఉంటే కాస్త పెట్టమని అడిగాడు. ఇంట్లో ఏముందో ఏంలేదో తెలీదు. ఇతగాడి వాలకం చూస్తే మాత్రం ఏమీ పెట్టబుద్ది అయినట్లు లేదు. రెండో ఇల్లు అంతే, ఆ ఇంటి తరువాత ఒక నాలుగు గడపలు దాటి అడిగినా అయిదో ఇంట్లో కూడా అదే స్పందన. మన కథానాయకుడు ఎవరైనా కానీ, ఏమైనా కానీ చాలా తెలివైన వాడు. ప్రాధేయపడి అడిగాం ఫలితం లేదు ఈ ఊరిలో ఇది కాదు పద్దతి అనుకున్నాడు. ఈసారి తలుపు తట్టిన ఇంటి వారికి మాత్రం తినడానికి ఏమైనా ఇవ్వండి అని అడగలేదు. ఇప్పుడే ఇస్తా ఒక కుండ ఉంటే ఇవ్వమని అడిగాడు . కుండ ఇచ్చినావిడ తలుపుకానుకుని ఏం చేస్తాడా అని చూస్తుంది. కుండని అలా నేలమీద పెట్టి అటు ఇటూ కనపడిన మూడు రాళ్లని, కాసింత ఎండు కొమ్మలు, గడ్డి పోచలు పట్టుకు వచ్చి మూడు రాళ్ల పొయ్యిగా ఆమర్చి దానిపై కుండని పెట్టి పొయ్యి వెలిగించ బోతూ వెనక్కి తిరిగి, కాసిన్ని మంచి నీళ్లు దొరుకుతాయా అవి ఉంటే చాలు పని అయిపోతుంది అన్నాడు. ఆవిడ కుండ నిండా నీళ్లు తెచ్చి ఇచ్చి చోద్యం చూస్తుంది. మనవాడు కుండ కింద మంట పెట్టి జేబులో చేయి పెట్టి ఒక గులక రాయిని బయటకు తీశాడు, భక్తిగా కళ్లకద్దుకుని ఆ రాయిని కుండలో జార విడుస్తూ ఆవిడ కేసి చూసి నవ్వాడు మరేం లేదమ్మా పులుసు రాయి అంతే అన్నాడు. పులుసు రాయా, అదేంటి ఎప్పుడూ వినలేదే ? అని వింత పోయింది ఆవిడ. ఈ రాయి వేసి పులుసు కాస్తే ఉంటుంది , అబ్బా అని లొట్టలేసి చూస్తారుగా అంటూ ఒక కర్ర పుల్ల తీసుకుని కుండలో కలియతిప్పడం మొదలు పెట్టాడు. తిప్పి తిప్పి మరిగిన నీళ్లు కాసిన్ని నాలుక మీద వేసి రుచి చూసుకుని అహా అన్నట్టు కనుబొమలు ఎగరేసి వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే ఈ రాయి చమత్కారం విని ఇరుగింటి ఆశమ్మ, పొరుగింటి పోశమ్మ, ఎదురింటి బూశమ్మ తతిమ్మా అమ్మలు కూడా చేరారు. పులుసు తయారీ దారు తనలో తాను అనుకున్నట్టుగా అంటూనే వారికి వినిపించేలా, బావుంది, చాలా బావుంది కానీ కాస్త చింతపండు, ఉప్పు, ఇంత జీలకర్ర ఉండి ఉంటే ఇంకా అద్భుతంగా తయారవుతుంది. ఈ మాటలు చెవిన పడ్డమే ఆలస్యం వెంటనే దినుసులు దిగి పోయాయి. చిరు నవ్వుతో వాటిని అందుకుని ఆ నీళ్లలోకి వంపాడు, పులుసు మరుగుతోంది, ఆవిరి తేలుతోంది. ఏం పర్లేదు కాస్త సమయం పడుతుంది. అన్నట్లూ మీరు పుట్టి బుద్ది ఎరిగిన దగ్గరి నుంచి ఈ ఊరు దాటి పొయిన వారిలా లేరు, ఇక్కడి నుండి దక్షిణం వైపుకు వంద మైళ్ల దూరంలో జింత్ర అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో పండుతాయండి క్యారెట్లు అబ్బో ఎంత రుచి అనుకున్నారు, ప్రపంచంలో అట్లాంటి కారెట్లు మరెక్కడా దొరకవు. వస్తున్నప్పుడు పాపం ఒక రెండు దుంపలు మీకోసం తేవాల్సింది. అన్నట్లూ మీ ఊర్లో క్యారెట్ ఎట్లా ఉంటాయి, పర్లేదా? అనే ప్రశ్న ముగిసి ముగియకమునుపే ఒకావిడ క్యారెట్ బుట్ట పట్టుకు వచ్చింది. ఆ బుట్టలోనే ఒక వైపు ఉర్లగడ్డలు కూడా ఉన్నాయి. పర్లేదే! చూడ్డానికి రంగు బాగా ఉన్నాయి, రుచి పరీక్షిస్తే పొలా అని ఒక చేత్తో నాలుగు కేరట్ దుంపలు ఇంకో చేత్తో ఆరు ఉర్లగడ్డలు ఆ మరుగు తున్న నీటిలో పడేసీ మళ్ళీ కబుర్లు మొదలు పెట్టాడు. ఉర్లగడ్డ పడిందిగా పులుసు చిక్కనయింది, ఘుమఘుమలు కూడా మొదలయ్యాయి. మళ్ళీ పుల్ల పట్టుకు తిప్పి రుచి చూడబోయాడు, ఈ సారి ఒక ఇల్లాలు చేయి చాపింది, పులుసు చుక్కలు ఆవిడ చేతిలో ఒంపాడు, ఆవిడ తన అరచేతిని నాకేసి తన్మయత్వంగా మొహం పెట్టింది, మరి ఇంట్లో తరిగిన క్యాబేజీ పోగులు ఉన్నాయి అవి కూడా వేద్దామా? అని అడిగింది. దానికేమమ్మా భాగ్యం? పులుసు రాయి దేనినయినా రుచితుల్యం చేస్తుంది పాపం వెళ్లి తెచ్చుకోండి అని ఉదారంగా అనుమతి ఇచ్చేశాడు. మొత్తానికి ఆసారి ఆయిన్ని, ఈసారి ఈయిన్ని దినుసులు చేరుతూనే ఉన్నాయి. ఇంతలో వేటకని అడివికి వెళ్లిన మగవాళ్లు పల్లెకు వచ్చేశారు. నలుగుడు ముక్క లేకుండా పులుసు ఏమిటి అని ఒక పెద్దాయన కోప్పడి తను వేటాడి తెచ్చిన కుందేళ్ల తాజా మాంసం ముక్కలు అందులో మరగనిచ్చాడు. పులుసు తయారు. అంతకన్నా అద్భుతమైన పులుసు ముందెన్నడూ తిని ఎరగలేదని తిన్నవాళ్లంతా ఏకగ్రీవపడ్డారు. తాను కూడా ఆ ఊరి అంత మంచివాళ్లని మునెపెన్నడూ ఎరిగి ఉండనని దానయ్య కూడా ప్రకటించి తన గుర్తుగా ఉంచుకొమ్మని కానుకగా ఆ పులుసు రాయిని వారికి ఇచ్చేసి తన దారి తాను చూసుకున్నాడు . ఈ కథని మా మిత్రుడు శ్రీనివాస్ చదివి కాని, విని కాని ఉంటారని నేను అనుకోవడం లేదు. ఆయనకు ఈ కథకు ఉన్న సంబంధం అల్లా, ఎట్లా అయితే ఆ కథలో కథానాయకుడు వనరులు ఏమీ లేని చోట, నలుగురూ నాలుగు చేతులు వేసినప్పుడు ఒక మహద్భుతం చేయవచ్చని నమ్మికతో నడుస్తున్నాడో , శ్రీనివాస్ ది అదే నమ్మిక. సినిమాలు తీయాలి. దాని కొరకు ముందుగా ఒక సినిమా అయినా తీయాలి అనేదే ఆయన లక్ష్యం. చేతిలో మ్యాజిక్ ఉంది. కాని చూసే వాడికి అవి ఖాళీ చేతుల్లా కనపడుతున్నాయే.. మరెలా అని కథ అనే గులకరాయిని పట్టుకుని ఆయన నడక మొదలెట్టాడు. పిడికిట్లో అది ఒదిగి ఉంది. నడక అనంతరం గుప్పిట విప్పి చూస్తే అది ముత్యంలా తయారయింది. ఒక పాతికేళ్ల అమ్మాయి, పేరు మీరా. రేపొక్క రోజు ఆగితే ఎల్లుండి తన పెళ్లి. బట్టలు తెచ్చుకోడానికి బయలు దేరిన అమ్మాయి సాయంత్రం అయిదు దాటింది.. ఆరు దాటింది.. ఏడయినా ఇల్లు చేరదే ! ఎక్కడా తప్పి పోయింది లేదు .. అమ్మ చేసినా.. నాన్న చేసినా , తమ్ముడు చేసినా.. కాబోయే శ్రీవారు, వారి అమ్మగారు, చిన్ననాటి మిత్రులు ఎవరు చేసినా ఫోన్ ఎత్తుతోంది .. వారితో మాట్లాడుతూనే ఉంది.. జవాబు చెబుతూనే ఉంది. పోని ఇదేమయినా ఇష్టం లేని పెళ్లా అంటే అదేం కాదు.. ప్రేమించిన అబ్బాయినే పెళ్లాడబోతుంది. మరేమిటి? ఇంటి నిండా బంధువులు, విడిదింట్లో మగపెళ్లి వారు, హోటల్ గదుల్లో మిత్రులు అంతా వచ్చి ఉన్నారు. టైలర్ షాపు నుంచి తిన్నగా ఇంటికి రావాల్సిన అమ్మాయి.. ఇంటి వైపు కాక ఊరిని వదిలి పెట్టి హైదరాబాదు నగరం వైపు.. నేషనల్ హైవే మీద ఒంటరిగా కారు నడుపుతూ వెళ్లావలసిన అవసరం ఏంటి? ఇదేం క్రైం థ్రిల్లర్ కాదు, యాక్షన్ ఓరియెంటెడ్ జానర్ అసలే కాదు. పూర్తిగా సంసార పక్ష సినిమా.. కుటుంబ గాథా చిత్రం. మనుషులు, అనుబంధాలు, నమ్మకాలు, ద్రోహాలు, కాసిన్ని కన్నీళ్లు, గోరంత దీపమంత ధైర్యం వెలుగులో కొండంత భయాన్ని ఎదుర్కొన్న ఒక ఆడపిల్ల కథ. సినిమా అంతా ఇందులో మీరా అన్న పాత్ర వహించిన గార్గేయి తప్పా మరో మనిషి మొహం కనపడదు. ఎన్నో గొంతులు వినపడతాయి. ఎన్నెన్నో భావనలు అర్థమవుతాయి. ఇందులో మనకు వినపడిన ప్రతి కరుకు గొంతు, ప్రతి మెత్తని పలుకు, ప్రతి కంగారు స్వరం ఆ మనిషి ఎలా ఉండి ఉంటారనేది మనకంటూ ఒక ఊహని కలుగ జేస్తుంది. మనం కళ్లతో సినిమా చూస్తూ.. ఊహల్లో సినిమాలోని పాత్రలని నిర్మించుకుంటాం. ఇంతకన్నా కథని ఏమి చెప్పలేను. ఇదంతా దర్శకత్వ ప్రతిభ . డైరెక్టర్ మూవీ ఇది. తెలుగులో గొప్ప ప్రయోగం ఇది. సగటు ప్రేక్షకుడి పైన ఉన్న నమ్మకం ఈ సినిమా . గర్వించే మన సినిమా ఇది. సినిమా చివరలో సుఖాంతంలో పెద్ద సమస్య నుంచి మీరా బయట పడుతుంది. ఆ మొహంలో, కళ్లల్లో, పెదవుల మీద గొప్ప రిలీఫ్ . ఆ సమయంలో ఏం చేయాలి? పిడుగును ఒడిసి పట్టి నలిపి పడేసినంత, కొండలని పిండి కొట్టి చెల్లా చెదురు చేసినంత గొప్ప ఫీల్ కావాలి. ఆ విజయాన్ని ఆస్వాదించాలి. కానీ ఆ అమ్మాయి చేసిన మొట్ట మొదటి పని తన తమ్ముడికి కాల్ కలిపి, బట్టలు కుట్టిన టైలర్కి చాలా అవసరంగా డబ్బులు కావాలి. అర్థ రాత్రి దాటి ఉన్నా పర్లేదు, ముందు ఆ అమ్మాయికి డబ్బులు అందించమంటుంది. సూది కుట్టంత చిన్న మనిషి, ఆవిడ అవసరం దగ్గర ఆపేసిన గొప్ప సినిమా ఇది. తప్పక చూడండి. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
పోస్టర్ బాగుంది – నాగార్జున
‘‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకునేలా బాగుంది. ఈ సినిమా హిట్ అయి, యూనిట్కి మంచి పేరు రావాలి’’ అన్నారు అక్కినేని నాగార్జున. బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో తేజ బొమ్మదేవర, రిషికా లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక–నిర్మాణ సారథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నాగార్జున రిలీజ్ చేశారు. ‘‘ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బాడిస, కెమెరా: వాసు. -
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న గాడ్ ఫాదర్.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పలు రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (చదవండి: బాలీవుడ్లో ‘గాడ్ ఫాదర్’ హవా.. 600 స్క్రీన్స్ పెంపు) గతంలో మెగాస్టార్ ఖైదీ నెం.150 మాత్రమే రూ.164 కోట్లతో ఆయన కెరీర్లో బెస్ట్గా నిలిచిందన్నారు. త్వరలోనే గాడ్ఫాదర్ ఈ రికార్డును అధిగమించనుందని ట్వీట్ చేశారు. గతంలో విడుదలైన ఆచార్య వసూళ్లను అధిగమించింది. గాడ్ ఫాదర్ 2019లో వచ్చిన మలయాళ చిత్రం లూసిఫర్కి తెలుగు రీమేక్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార, సత్యదేవ్ నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. #GodFather ENTERS ₹100 cr club at the WW Box Office. — Manobala Vijayabalan (@ManobalaV) October 8, 2022 -
25 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా ?
Heroines Who Married At Young Age: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆసక్తికరంగా ఉండే టాపిక్లో పెళ్లి ఒకటి. మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలకు వివాబం ఎప్పుడు జరిపిస్తారు అని చుట్టుపక్కల వాళ్లు విసిగిస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి లొల్లి సెలబ్రిటీలను కూడా వెంటాడుతూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎప్పుడు వివాహమాడాతారు. పెళ్లికానీ ప్రసాద్ (హీరోలు)లు ఎంతమంది ఉన్నారు అని ఆసక్తి చూపుతారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వారికి అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఉంటుందని అంటారు. అందుకేనేమో 30 ఏళ్లు దాటినా కూడా తాళి కట్టించుకోని హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలాంటి సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా కథనాయికలు కూడా ఉన్నారు. పాతికేళ్లు కూడా దాటకుండానే కెరీర్ పీక్స్లో ఉండగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చిన హీరోయిన్లూ ఉన్నారు. పాతికేళ్లలోపు వయసుండి పెళ్లిపీటలు ఎక్కిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా ! 1. సాయేషా సైగల్ అఖిల్, బందోబస్తు, టెడ్డీ, యువరత్న సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్. ఈ హీరోయిన్ 2019లో హీరో ఆర్యను పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమెకు 22 ఏళ్లు. 2. నిషా అగర్వాల్ చందమామ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ సోలో, సుకుమారుడు, ఏమైంది ఈ వేళ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అక్టోబర్ 18, 1989లో పుట్టిన ఈ అమ్మడు 24 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందే డిసెంబర్ 28, 2013లో పెళ్లి పీటలు ఎక్కింది నిషా. 3. షాలినీ మాధవన్ సరసన నటించిన 'సఖి' చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఆ చిత్రం తర్వాత షాలినీ యూత్ గుండెల్లో సఖిగా కొలువైంది. షాలినీ 21 వయసులో హీరో అజిత్ను 2000లో వివాహమాడింది. 4. జెనీలియా జెనీలీయా బొమ్మరిల్లు సినిమాతో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా జెన్నీకి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆగస్టు 5, 1987న పుట్టిన హాసిని 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ను వివాహం చేసుకుంది. అప్పుడు జెనీలియాకు 25 ఏళ్లు. 5. నజ్రియా నజీమ్ రాజారాణి, బెంగళూర్ డేస్, ట్రాన్స్ సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ నజ్రియా నజీమ్. ప్రముఖ మళయాల నటుడు ఫహద్ ఫాజిల్ భార్య నజ్రీయా నజీమ్. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నజ్రియాకు 20 ఏళ్లు. ఇది చదవండి: సమంత సరికొత్త ఫొటోలు.. నెట్టింట్లో వైరల్
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement