ఈ ప్రయాణం ఓ జ్ఞాపకం

keerthi suresh is penguin movie shooting completed - Sakshi

‘పెంగ్విన్‌’ చిత్రబృందానికి టాటా చెప్పేశారు కథానాయిక కీర్తీ సురేష్‌. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో కీర్తీ సురేష్‌ నటించిన లేడీ ఓరియంటెడ్‌ మూవీ ఇది. ‘పేట’ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాకు ఓ నిర్మాత. ఈ చిత్రంలో గర్భవతి పాత్రలో నటించారు Mీ ర్తి.‘‘పెంగ్విన్‌’ చిత్రీకరణ ముగిసింది. ఈ సినిమా ప్రయాణం నా కెరీర్‌లో జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సహకరించిన చిత్రబృందానికి ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని కీర్తీసురేష్‌ పేర్కొన్నారు. తెలుగులో ‘మిస్‌ ఇండియా, గుడ్‌లక్‌ సఖీ’ సినిమాలతో పాటు హిందీలో ‘మైదాన్‌’ అనే చిత్రంతో కీర్తీ సురేష్‌ మస్త్‌ బిజీగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top