ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను! | gopichand and Wife Reshma visit Mount Abu | Sakshi
Sakshi News home page

ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను!

Mar 18 2015 11:16 PM | Updated on Sep 2 2017 11:02 PM

ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను!

ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను!

నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినిమా తారలు సేద తీరాలనుకుంటారు. గోపీచంద్ కూడా అలా అనుకున్నారో ఏమో!

నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినిమా తారలు సేద తీరాలనుకుంటారు. గోపీచంద్ కూడా అలా అనుకున్నారో ఏమో!  తన సతీమణి రేష్మాతో కలిసి ఆయన మౌంట్ అబు వెళ్లారు. ఈ నెల 15, 16 తేదీల్లో అక్కడి బ్రహ్మ కుమారీస్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్‌కి వెళ్లారు. ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు జానకీ జీ, గుల్జార్ జీ, రతన్ మోహినీ జీలను గోపీ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘మౌంట్ అబులోని డైమండ్ హాల్‌లో పాతికవేల మంది బ్రహ్మ కుమారీల ఆధ్వర్యంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ సమయంలో నాకు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. బ్రహ్మకుమారీలందరూ స్వచ్ఛమైన ప్రేమతో, నిండైన మనసుతో మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ ఆధ్యాత్మిక సంస్థ ప్రతి ఒక్కరికీ సరైన శాంతి మార్గం చూపుతుందనే నమ్మకం కలిగింది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement