నో ఈగోస్‌! | Sakshi
Sakshi News home page

నో ఈగోస్‌!

Published Tue, May 16 2017 12:01 AM

నో ఈగోస్‌! - Sakshi

సడన్‌గా ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్‌ సీకే మురళీధరన్‌ తప్పుకున్నారనే వార్త బయటకొచ్చింది. ఆయన ప్లేస్‌లో చోటా కె. నాయుడు వచ్చి చేరారు. ఇందులో వింతేముంది? సినిమా అన్నాక ఇలాంటివి కామనే కదా అనుకోవచ్చు. అయితే... ఇక్కడే ఉంది తిరకాసు. ఆల్మోస్ట్‌ వన్‌ మంత్‌ ఈ సినిమా షూటింగ్‌ జరిగిన తర్వాత సినిమాటోగ్రాఫర్‌ తప్పుకోవడానికి రీజన్‌ ఏంటి చెప్మా? అని అభిమానులు ఆలోచిస్తున్న టైమ్‌లో ‘దర్శకుడితో ఈగో క్లాషెస్‌ అంట’ అని కొందరు వార్తలు వండేశారు.

 వీటిపై సినిమా టీమ్‌ త్వరగా స్పందించిందండోయ్‌! ‘‘ఈగో క్లాషెస్‌ గట్రా ఏం కాదు. ఆ వార్తల్లో నిజం లేదు. అంతకు ముందున్న కమిట్‌మెంట్స్‌ వల్ల మురళీధరన్‌ తప్పుకున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ నెల 20న ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా 19నే సినిమాలో హీరో ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తున్నారు. కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు.
 

Advertisement
Advertisement