చారుశీల ఏం చేసింది? | Charuseela movie shooting completed | Sakshi
Sakshi News home page

చారుశీల ఏం చేసింది?

Jul 17 2016 12:39 AM | Updated on Sep 4 2017 5:01 AM

చారుశీల ఏం చేసింది?

చారుశీల ఏం చేసింది?

రష్మీ గౌతమ్, రాజీవ్ కనకాల, జశ్వంత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘చారుశీల’. శ్రీనివాస్ ఉయ్యూరు దర్శకుడు.

రష్మీ గౌతమ్, రాజీవ్ కనకాల, జశ్వంత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘చారుశీల’. శ్రీనివాస్ ఉయ్యూరు దర్శకుడు. కొండపల్లి సమర్పణలో జోత్స్న ఫిలింస్ పతాకంపై ప్రముఖ దర్శకులు వి.సాగర్, సిద్ధిరెడ్డి, జయశ్రీ అప్పారావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. చూస్తున్నంత సేపూ తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠకు లోనవుతారు. చారుశీలగా రష్మీ నటనకు అవార్డులు రావడం ఖాయం.
 
 కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ ఈ చిత్రం. బ్రహ్మానందం, మెల్కోటి, జబర్దస్త్ టీం మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. మాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: కుమార్ మల్లారపు, సంగీతం: సుమన్ జూపూడి, కథ-కథనం- ఛాయాగ్రహణం- దర్శకత్వం: శ్రీనివాస్ ఉయ్యూరు.

Advertisement
 
Advertisement
Advertisement